యాప్నగరం

లైంగిక వేధింపుల ఆరోపణలు.. సీజేఐకి క్లీన్‌చిట్

సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల్ని అంతర్గత దర్యాప్తు కమిటీ కొట్టివేసింది. సీజేఐకి క్లీన్ చిట్ ఇచ్చింది.

Samayam Telugu 6 May 2019, 10:07 pm
సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణల్ని సుప్రీం కోర్టు అంతర్గత దర్యాప్తు కమిటీ కొట్టిపారేసింది. సీజేఐపై కోర్టు ఉద్యోగి చేసిన ఆరోపణలు అవాస్తవమని జస్టిస్ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని త్రిసభ్య విచారణ కమిటీ తేల్చింది. 2003 నాటి ఇందిరా జైసింగ్ తీర్పును అనుసరించి కమిటీ నివేదికను బహిర్గతం చేయడం కుదరదని స్పష్టం చేసింది. రంజన్‌పై ఆరోపణలు చేసిన మహిళ గతంలో ఆయన నివాసంలో పని చేసింది. ఆ సమయంలోనే తనపై ఆయన లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ అఫిడవిట్ దాఖలు చేసింది. కాగా తనపై లైంగిక ఆరోపణలు చేయడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని రంజన్ గొగోయ్ ఆరోపించారు.
Samayam Telugu cji


త్రిసభ్య ప్యానెల్‌లో తొలుత జస్టిస్ ఎన్వీ రమణ కూడా సభ్యుడిగా ఉన్నారు. కానీ ఆయన రంజన్ గొగోయ్‌కు సన్నిహితుడని ఫిర్యాదుదారు ఆరోపించారు. వీటిని రమణ తోసిపుచ్చినప్పటికీ.. ఆయన స్థానంలో జస్టిస్ మల్హోత్రాకు చోటు దక్కింది.

సీజేఐపై ఫిర్యాదు చేసిన మహిళను జస్టిస్ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఇందిరా బెనర్జీ, జస్టిస్ ఇందూ మల్హోత్రాలో కూడిన కమిటీ రెండు రోజులపాటు విచారించి ఆమె స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేసింది. అడ్వొకేట్ వృందా గ్రోవర్ సహకారం తీసుకోనీయలేదని ఆరోపిస్తూ ఆమె మూడో రోజు విచారణకు గైర్హాజయ్యారు. సీజేఐపై ఫిర్యాదు చేయడం కోసం సదరు మహిళకు అడ్వొకేట్లయిన వృందా గ్రోవర్, ప్రశాంత్ భూషణ్, శాంతి భూషణ్, ఇందిరా జైసింగ్, కామినీ జైస్వాల్ సహకరించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.