గుజరాత్ శాసనసభకు పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడయ్యాయి. గుజరాత్లో బీజేపీ తిరిగి అధికారం చేపడుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేయడంతో ఈవీఎంలపై కాంగ్రెస్ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీనిపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఈవీఎంలు ట్యాంపరింగ్కు పాల్పడ్డారని, వాటిని పరిశీలించాలని కోరుతూ ఆ పార్టీ వేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఎన్నికల కమిషన్ అధికారాల్లో తాము జోక్యం చేసుకోలేమని, ప్రక్రియ కొనసాగుతున్నందున తాము జోక్యంచేసుకోడానికి తగిన కారణాలు కనిపించడం లేదని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రక్రియకు చాలా ప్రాధాన్యం ఉందని కోర్టు వ్యాఖ్యానించింది.
ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను, వీవీప్యాట్లతో దాదాపు 25 శాతం ఓట్లను ఈ విధంగా సరి చూడాలని కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్లో కోరింది. గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్పై ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ పిటిషన్పై శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపేందుకు అంగీకరించిన సుప్రీం, కాంగ్రెస్ విఙ్ఞప్తిని తిరస్కరించింది.
ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ సిస్టమ్ (వీవీప్యాట్) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ తొలిసారిగా వినియోగించింది. దీని వల్ల ఈవీఎంలో ఓటువేసిన తర్వాత సరి చూసుకోవచ్చు. తాను ఓటువేసిన గుర్తుకే ఓటు నమోదైందీ, లేనిదీ గుర్తు పట్టవచ్చు. ఓటింగ్లో మోసాలు, జరిగాయా, లేదో కూడా తెలుసుకోవచ్చు. ఈవీఎంలపై రాజకీయ పార్టీలు చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టి, తమ నిబద్ధతను నిరూపించుకోవడానికి వీవీప్యాట్ను ఈసీ వినియోగించింది. రెండు దశల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసిన విషయం తెలిసింది. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. గుజరాత్లో తిరిగి భాజపా అధికారంలోకి వస్తుందని, హిమాచల్ప్రదేశ్లోనూ కాషాయ జెండా ఎగురుతుందని స్పష్టం చేశాయి.
ఈ ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని, ఈవీఎంలలో నిక్షిప్తమైన ఓట్లను, వీవీప్యాట్లతో దాదాపు 25 శాతం ఓట్లను ఈ విధంగా సరి చూడాలని కాంగ్రెస్ పార్టీ తన పిటిషన్లో కోరింది. గుజరాత్ కాంగ్రెస్ చీఫ్ సుప్రీంకోర్టులో దాఖలు చేసిన ఈ పిటిషన్పై ఆ పార్టీ సీనియర్ నేత కపిల్ సిబల్ వాదనలు వినిపించేందుకు సిద్ధమయ్యారు. ఈ పిటిషన్పై శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు విచారణ జరిపేందుకు అంగీకరించిన సుప్రీం, కాంగ్రెస్ విఙ్ఞప్తిని తిరస్కరించింది.
ఓటర్ వెరిఫైబుల్ పేపర్ ఆడిట్ సిస్టమ్ (వీవీప్యాట్) గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కేంద్ర ఎన్నికల కమిషన్ తొలిసారిగా వినియోగించింది. దీని వల్ల ఈవీఎంలో ఓటువేసిన తర్వాత సరి చూసుకోవచ్చు. తాను ఓటువేసిన గుర్తుకే ఓటు నమోదైందీ, లేనిదీ గుర్తు పట్టవచ్చు. ఓటింగ్లో మోసాలు, జరిగాయా, లేదో కూడా తెలుసుకోవచ్చు. ఈవీఎంలపై రాజకీయ పార్టీలు చేస్తోన్న విమర్శలను తిప్పికొట్టి, తమ నిబద్ధతను నిరూపించుకోవడానికి వీవీప్యాట్ను ఈసీ వినియోగించింది. రెండు దశల్లో జరిగిన గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ గురువారంతో ముగిసిన విషయం తెలిసింది. పోలింగ్ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ విడుదలయ్యాయి. గుజరాత్లో తిరిగి భాజపా అధికారంలోకి వస్తుందని, హిమాచల్ప్రదేశ్లోనూ కాషాయ జెండా ఎగురుతుందని స్పష్టం చేశాయి.