ఆమె కర్ణాటకకు చెందిన ఓ రాజకీయ నాయకుడి కుమార్తె. ఇంజినీరింగ్ చదివిన తను ఓ యువకుడిని ప్రేమించింది. కులాలు వేరే కావడంతో ఇంట్లోవాళ్లు అతణ్ని పెళ్లాడేందుకు ఒప్పుకోలేదు. ఆమెకు ఇష్టం లేకుండానే.. మరో వ్యక్తితో బలవంతంగా పెళ్లి చేశారు. వివాహమయ్యాక ఢిల్లీ పారిపోయిన ఆమె.. జరిగిందంతా వివరిస్తూ సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసింది. తన సమ్మతి లేకుండా చేసిన పెళ్లిని రద్దు చేయాలని, పరువు కోసం కుటుంబ సభ్యులు తనను చంపేసే అవకాశం ఉంది కాబట్టి రక్షణ కల్పించాలని కోరింది.
ఈ పెళ్లి తనకు గానీ, తన భర్తకు గానీ ఇష్టం లేదని, కానీ బలవంతంగా పెళ్లి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మార్చి 14న పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారని కోర్టుకు చెప్పింది. ఇష్టం లేని పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె ఏఎస్పీకి మెసేజ్ పెట్టింది. కానీ పోలీసులు అక్కడి వచ్చేలోగానే.. పెళ్లిని వ్యతిరేకించొద్దని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పెళ్లాడాల్సి వచ్చింది.
భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదంటే ఇంట్లోవాళ్లు బెదిరించారని వాపోయింది. దీంతో వివాహమైన మూడో రోజే ఇంట్లో నుంచి పారిపోయి ఢిల్లీ వచ్చానని చెప్పింది. హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లికి ముందే వధువు లేదా వరుడి సమ్మతి తప్పనిసరి కాదు. దీన్ని సవరిస్తూ.. పెళ్లికి ముందే వధువరుల సమ్మతి తప్పనిసరి చేయాలని ఆమె సుప్రీంను కోరింది.
26 ఏళ్ల ఆ యువతి వినతిని స్వీకరించిన ధర్మాసనం.. ఆమెకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఆమె పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన బెంచ్.. సివిల్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచుద్లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. ఆమె పిటీషన్ను హెబియస్ కార్పస్గా పరిగణిస్తామని తెలిపింది. కానీ హిందూ వివాహ చట్టంలోని ప్రత్యేక నిబంధనలకు ఆమె పిటీషన్తో సంబంధం లేదని తేల్చి చెప్పింది.
కోర్టును ఆశ్రయించిన యువతి, ఆమె కుటుంబ సభ్యుల వివరాలను బయటపెట్టకుండా ఉండేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసు విషయంలో స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. మే తొలి వారంలో మరోసారి ఈ కేసును అత్యున్నత ధర్మాసనం విచారించనుంది.
ఈ పెళ్లి తనకు గానీ, తన భర్తకు గానీ ఇష్టం లేదని, కానీ బలవంతంగా పెళ్లి చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. మార్చి 14న పెద్దలు బలవంతంగా పెళ్లి చేశారని కోర్టుకు చెప్పింది. ఇష్టం లేని పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవాలని ఆమె ఏఎస్పీకి మెసేజ్ పెట్టింది. కానీ పోలీసులు అక్కడి వచ్చేలోగానే.. పెళ్లిని వ్యతిరేకించొద్దని కుటుంబ సభ్యులు ఆమెపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పెళ్లాడాల్సి వచ్చింది.
భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదంటే ఇంట్లోవాళ్లు బెదిరించారని వాపోయింది. దీంతో వివాహమైన మూడో రోజే ఇంట్లో నుంచి పారిపోయి ఢిల్లీ వచ్చానని చెప్పింది. హిందూ వివాహ చట్టం ప్రకారం పెళ్లికి ముందే వధువు లేదా వరుడి సమ్మతి తప్పనిసరి కాదు. దీన్ని సవరిస్తూ.. పెళ్లికి ముందే వధువరుల సమ్మతి తప్పనిసరి చేయాలని ఆమె సుప్రీంను కోరింది.
26 ఏళ్ల ఆ యువతి వినతిని స్వీకరించిన ధర్మాసనం.. ఆమెకు రక్షణ కల్పించాలని ఢిల్లీ పోలీసులను ఆదేశించింది. ఆమె పెళ్లి విషయంలో జోక్యం చేసుకోవడానికి నిరాకరించిన బెంచ్.. సివిల్ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ ఏఎం ఖాన్విల్కర్, జస్టిస్ డీవై చంద్రచుద్లతో కూడిన బెంచ్ ఈ కేసును విచారించింది. ఆమె పిటీషన్ను హెబియస్ కార్పస్గా పరిగణిస్తామని తెలిపింది. కానీ హిందూ వివాహ చట్టంలోని ప్రత్యేక నిబంధనలకు ఆమె పిటీషన్తో సంబంధం లేదని తేల్చి చెప్పింది.
కోర్టును ఆశ్రయించిన యువతి, ఆమె కుటుంబ సభ్యుల వివరాలను బయటపెట్టకుండా ఉండేందుకు కోర్టు అంగీకరించింది. ఈ కేసు విషయంలో స్పందించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీం నోటీసులు జారీ చేసింది. మే తొలి వారంలో మరోసారి ఈ కేసును అత్యున్నత ధర్మాసనం విచారించనుంది.