రద్దుచేసిన నోట్లను మరోసారి డిపాజిట్ చేసుకునే అవకాశం ప్రజలకు కల్పించే ఉద్దేశం ఏమైనా ఉందా అని మంగళవారం సుప్రీం కోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. నిజంగా ఇబ్బంది పడుతున్న ప్రజల కోసం మీరేమైనా ఆర్డినెన్స్ తీసుకువస్తున్నారా అని కేంద్రాన్ని అడిగింది. నరేంద్ర మోదీ గతేడాది నవంబర్ 8న రూ. 500, రూ. 2000 నోట్లను రద్దుచేసినట్లు ప్రకటించిన తరవాత వాటిని బ్యాంకుల్లో డిపాజిట్ చేసుకునేందుకు డిసెంబర్ 31 వరకు గడువు ఇచ్చారు. అప్పటికీ ఎవరైనా జమచేయలేకపోతే మార్చి 31 వరకు ఆర్బీఐ కార్యాలయాల్లో జమ చేసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది.
ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆర్బీఐలో మాత్రం పాతనోట్లను జమచేసుకోవడం లేదు. కేవలం ఎన్ఆర్ఐలకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజావాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. ఖేహర్ సారథ్యంలోని బెంచ్ ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. పాత నోట్లను జమ చేసుకోవడానికి కేవలం ఎన్ఆర్ఐలకు మాత్రమే ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు పాతనోట్లు జమచేసుకునే అవకాశం మళ్లీ కల్పిస్తారా లేదా అనే విషయంపై ఏప్రిల్ 11లోగా ఒక అఫిడవిట్ ద్వారా కోర్టుకు వివరించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐని సుప్రీం ఆదేశించింది.
ప్రభుత్వం ప్రకటించినప్పటికీ ఆర్బీఐలో మాత్రం పాతనోట్లను జమచేసుకోవడం లేదు. కేవలం ఎన్ఆర్ఐలకు మాత్రమే ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. దీనిపై సుప్రీం కోర్టులో దాఖలైన ప్రజావాజ్యం మంగళవారం విచారణకు వచ్చింది. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ జె.ఎస్. ఖేహర్ సారథ్యంలోని బెంచ్ ఈ అంశంపై కేంద్రాన్ని ప్రశ్నించింది. పాత నోట్లను జమ చేసుకోవడానికి కేవలం ఎన్ఆర్ఐలకు మాత్రమే ఎందుకు అవకాశం ఇస్తున్నారని ప్రశ్నించింది. సామాన్య ప్రజలకు పాతనోట్లు జమచేసుకునే అవకాశం మళ్లీ కల్పిస్తారా లేదా అనే విషయంపై ఏప్రిల్ 11లోగా ఒక అఫిడవిట్ ద్వారా కోర్టుకు వివరించాలని కేంద్ర ప్రభుత్వంతో పాటు ఆర్బీఐని సుప్రీం ఆదేశించింది.