యాప్నగరం

Sabarimala Case: శబరిమలలో మహిళల ప్రవేశంపై నేడు సుప్రీం తీర్పు

ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళల ప్రవేశం నిషేధంపై నేడు కీలక తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు

Samayam Telugu 28 Sep 2018, 8:20 am
శబరిమలలో మహిళల ప్రవేశంపై సుప్రీంకోర్టు శుక్రవారం (సెప్టెంబరు 28) తీర్పు ప్రకటించనుంది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు గల మహిళల ప్రవేశం నిషేధించడాన్ని సవాలు చేస్తూ యంగ్‌ లాయర్స్‌ అసోసియేషన్‌తో పాటు మరికొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. వీటిపై ఆగస్టు 1 నుంచి 8 రోజులపాటు ఇరు వర్గాల వాదనలు విన్న చీఫ్‌ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం.. తీర్పును రిజర్వ్‌ చేసింది. ఈ తీర్పును శుక్రవారం వెలువరించనుంది.
Samayam Telugu SUPREME COURT1


మహిళలల్లో వచ్చే రుతుస్రావం (పీరియడ్స్) కారణంగా 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసు బాలికలు, మహిళలు కేరళలోని శబరిమల ఆలయంలోకి ప్రవేశించడంపై నిషేధం ఉంది. అయితే ఈ చర్య లింగసమానత్వానికి విరుద్ధమంటూ 2006లో మహిళా న్యాయవాదుల బృందం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. మరి కొందరు కూడా ఇదే విషయమై సుప్రీంలో పిటిషన్లు వేశారు. అయ్యప్పస్వామి 'బ్రహ్మచారి' అని.. అందుకే ఈ ఆచారాన్ని పాటిస్తూ, పీరియడ్స్ వచ్చే అమ్మాయిలను, మహిళలను ఆలయంలోకి అనుమతించడంలేదని దేవస్థానం అధికారులు గతంలో స్పష్టం చేశారు.

పిటిషన్లపై విచారణ జరిపిన చీఫ్ జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యంగ ధర్మాసనం.. ఆలయంలోకి ప్రవేశించి, పూజలు చేసుకోవడం మహిళల రాజ్యాంగ హక్కు అనీ, ఈ విషయంలో లింగ వివక్షకు తావులేదని స్పష్టం చేసింది. అలా నిషేధం విధించడం మహిళల హక్కులను కాలరాయడమే అవుతుందని వ్యాఖ్యానించింది. రాజ్యంగంలోని ఆర్టికల్‌ 25, 26ల ప్రకారం పురుషులకు వర్తించేవన్నీ మహిళలకు కూడా వర్తిస్తాయని స్పష్టం చేసింది. తీర్పును రిజర్వ్‌లో ఉంచింది. శుక్రవారం తీర్పు వెల్లడించనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.