యాప్నగరం

Aadhaar:'ఆధార్‌'పై నేడు సుప్రీం కీలక తీర్పు

దేశంలో దాదాపు 99 శాతం మంది ప్రజలకు జారీ చేసిన ఆధార్‌ నంబర్‌.. భారత పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన గోప్యత హక్కుకు భంగం కలిగించేలా ఉందని సుప్రీంలో పిటిషన్లు దాఖలయ్యాయి.

Samayam Telugu 26 Sep 2018, 10:03 am
ఆధార్‌పై బుధవారం (సెప్టెంబరు 26) సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనుంది. దీనిపై గతంలో వాదనలు విన్న ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం నాలుగు నెలలుగా తీర్పును రిజర్వులో ఉంచింది. దేశంలో దాదాపు 99 శాతం మంది ప్రజలకు జారీ చేసిన ఆధార్‌ నంబర్‌.. భారత పౌరుల ప్రాథమిక హక్కుల్లో ఒకటైన గోప్యత హక్కుకు భంగం కలిగించేలా ఉందని పిటిషన్లు దాఖలయ్యాయి.
Samayam Telugu aadhar-bccl


పౌరుల వేలిముద్రలు, ఐరిస్‌తో ఉన్న ఆధార్‌ డేటాబేస్‌ను ప్రైవేటు వ్యక్తులు దుర్వినియోగపర్చే అవకాశముందని పిటిషన్ తరఫు న్యాయవాదులు వాదించారు. అయితే ఈ వాదనను కేంద్ర ప్రభుత్వం కొట్టిపారేస్తుంది. భద్రతకు ఆధార్ తో సంబంధం లేదని.. అవినీతిని నిరోధించడంతో పాటు నిధులు పక్కదారి పట్టకుండా నేరుగా లబ్ధిదారులకు చేరాలన్న ఉద్దేశంతోనే ఆధార్‌ అనుసంధానం చేపట్టామని వాదించింది. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు తీర్పును సెప్టెంబరు 26కి వాయిదా వేసింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.