యాప్నగరం

లోయలో పడిన స్కూల్ బస్సు.. ఏడుగురి దుర్మరణం

హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పాఠశాల బస్సు లోయలో పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులు సహా డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు.

Samayam Telugu 5 Jan 2019, 5:30 pm
స్కూల్ బస్సు లోయలో పడిన ఘటనలో ఆరుగురు చిన్నారులతో పాటు బస్సు డ్రైవర్ దుర్మరణం పాలయ్యారు. హిమాచల్‌ ప్రదేశ్‌లోని సిర్మౌర్‌ జిల్లాలో శనివారం (జనవరి 5) ఉదయం ఈ ఘోర ప్రమాదం జరిగింది. డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన బస్సు విద్యార్థులను పాఠశాలకు తీసుకెళ్తుండగా.. రేణుకజి ప్రాంతంలో అదుపుతప్పి లోయలోకి జారిపోయింది. లోతైన లోయలో పడిపోవడంతో చిన్నారులంతా బస్సులో నలిగిపోయారు. ఘటనలో మరో 12 మంది చిన్నారులు గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు.
Samayam Telugu bus


క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవర్‌ రామ్‌ స్వరూప్‌ (40)తో పాటు మరో ముగ్గురు విద్యార్థులు ఘటనా స్థలంలోనే మరణించారు. మరో ముగ్గురు విద్యార్థులు నహాన్‌ వైద్య కళాశాలలో చికిత్స పొందుతూ చనిపోయారు.

లోయలోకి పడిపోవడంతో బస్సు తీవ్రంగా ధ్వంసమైంది. సహాయ చర్యలు క్లిష్టంగా మారాయి. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకి తీసుకురావడం కష్టతరంగా మారిందని అధికారులు చెప్పారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.