యాప్నగరం

మొబైల్ పోయిందన్న బాధతో విద్యార్థిని ఆత్మహత్య

టెన్త్ క్లాస్ చదువుతున్న కూతురికి తండ్రి ప్రేమతో కొనిచ్చిన మొబైల్ కనిపించలేదు. దీంతో విద్యార్థిని బలవన్మరణం చెందింది.

Samayam Telugu 17 Nov 2018, 12:04 am
రానురాను యువత సెన్సిటీవ్ (సున్నిత మనస్కులు)గా మారుతున్నారు. టీవీ రిమోట్ ఇవ్వలేదని ఒకరు, ఇంట్లో తిట్టారని కొందరు, పరీక్ష తప్పారంటూ కొందరు.. ఇలా పలు కారణాలతో బలవన్మరణాలు చెందుతున్నారు. కర్ణాటకలోని మైసూరులో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్నానని మనస్తాపం చెందిన విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడింది.
Samayam Telugu Mysore Student Suicide


స్థానిక నగరంలోని గాంధీనగర్‌కు చెందిన నిఖిత (16) గాయత్రిపురంలో ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో టెన్త్ క్లాస్ చదువుతోంది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం సోదరుడికి ఫోన్ చేసి మాట్లాడింది. ఆ తర్వాత నిఖితకు తన సెల్‌ఫోన్‌ కనిపించలేదు. తండ్రి తనకు ఎంతో ప్రేమగా కొనిచ్చిన మొబైల్ కనిపించలేదని మనస్తాపానికి లోనైన విద్యార్థిని గురువారం ఇంట్లో ఎవరు లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.