యాప్నగరం

104 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!

పచ్చని పంటపొలాల్లో కలుపు మొక్కలొస్తే రైతులు ఏం చేస్తారు? ఏరిపారేస్తారు! అలా వాటిని ఏరిపారేయకుండా వదిలిస్తే, మనకు ఆహారధాన్యాలు లభించడమే గగనం అయిపోతుంది. అలాగే, సైన్యం కూడా దేశంలోకి ప్రవేశించిన తీవ్రవాదులను ఏరిపారేస్తోంది.

TNN 15 Jul 2017, 4:19 pm
పచ్చని పంటపొలాల్లో కలుపు మొక్కలొస్తే రైతులు ఏం చేస్తారు? ఏరిపారేస్తారు! అలా వాటిని ఏరిపారేయకుండా వదిలిస్తే, మనకు ఆహారధాన్యాలు లభించడమే గగనం అయిపోతుంది. అలాగే, సైన్యం కూడా దేశంలోకి ప్రవేశించిన తీవ్రవాదులను ఏరిపారేస్తోంది. మన ప్రాణాలకు భద్రత కల్పిస్తుంది. ఈ ఏడాది కశ్మీర్‌లో నక్కిన చీడపురుగులను ఏరి వేయడంలో భారత సైన్యం ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తోంది.
Samayam Telugu security forces have gunned down 104 terrorists in jk
104 మంది ఉగ్రవాదులను మట్టుబెట్టిన సైన్యం!


ఇందులో భాగంగం దాదాపు 104 మంది తీవ్రవాదులను మట్టుబెట్టింది. దాదాపు ఏడేళ్ల తర్వాత సైన్యం మళ్లీ ఈ స్థాయిలో తీవ్రవాదులకు మళ్లీ చెమటలు పట్టిస్తోంది. 2010లో 156 మంది తీవ్రవాదులను సైన్యం మట్టుబెట్టింది. గతేడాది 77, 2015లో 51 మంది తీవ్రవాదులు సైన్యం కాల్పుల్లో మరణించినట్లు పోలీస్ రికార్డులు చెబుతున్నాయి.

మరణించినవారిలో లష్కరే తొయిబా, హిజ్బుల్ ముజాహిదీన్‌కు చెందిన తీవ్రవాదులే అత్యధికంగా ఉన్నారు. ప్రస్తుతం సైన్యం హిట్ లిస్ట్‌లో 12 మంది ఉగ్రవాదుల నాయకులు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఏరివేత కార్యక్రమం కొనసాగుతూనే ఉంటుందని సైన్యం వెల్లడించింది. దేశాన్ని అతలాకుతలం చేస్తున్న పాక్ ప్రేరేపిత ఉన్మాదులను ఏరివేస్తూ, మనల్ని కంటికి రెప్పలా కాపాడుతోన్న సైన్యానికి సెల్యూట్ చేయకుండా ఉండగలమా!

Photo: AP

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.