తనపై దాఖలైన దేశద్రోహం కేసును త్వరితగతిన విచారణ చేపట్టాలని తమిళనాడు ఎండీఎంకే నేత వైగో సోమవారం కోర్టులో లొంగిపోయారు. ఆయన బెయిల్ పొందడానికి నిరాకరించారు. దీంతో న్యాయమూర్తి వైగోకు 14రోజుల రిమాండ్ విధించారు.
అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు పలు ప్రజాసమస్యలపై తాను రాసిన బహిరంగ లేఖలను వైగో ‘నాన్ కుట్రమ్ సత్తుగిరేన్’ (నేను నిన్ను నిందిస్తున్నా) అనే పేరుతో 2009లో సంకలన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం విడుదల సందర్భంగా మాట్లాడిన వైగో ప్రసంగం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, చెన్నై పోలీసులు దేశద్రోహం కేసు పెట్టారు. 2010లో చార్జీషీట్ దాఖలు చేసినా ఇప్పటి వరకు విచారణ జరపలేదు.
దీంతో వైగో సోమవారం చెన్నైలోని ఎనిమిదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోపినాథ్ ఎదుట లొంగిపోయారు. అయితే మెజిస్ట్రేట్ వైగోకు బెయిల్ కు దరఖాస్తుకు అవకాశం కల్పించినా ఆయన తిరస్కరించారు. దీంతో ఆయన వైగోకు 14రోజుల రిమాండ్ విధించారు.
అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ కు పలు ప్రజాసమస్యలపై తాను రాసిన బహిరంగ లేఖలను వైగో ‘నాన్ కుట్రమ్ సత్తుగిరేన్’ (నేను నిన్ను నిందిస్తున్నా) అనే పేరుతో 2009లో సంకలన పుస్తకాన్ని విడుదల చేశారు. ఈ పుస్తకం విడుదల సందర్భంగా మాట్లాడిన వైగో ప్రసంగం దేశ సమగ్రతను దెబ్బతీసే విధంగా ఉందని, చెన్నై పోలీసులు దేశద్రోహం కేసు పెట్టారు. 2010లో చార్జీషీట్ దాఖలు చేసినా ఇప్పటి వరకు విచారణ జరపలేదు.
దీంతో వైగో సోమవారం చెన్నైలోని ఎనిమిదో మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ గోపినాథ్ ఎదుట లొంగిపోయారు. అయితే మెజిస్ట్రేట్ వైగోకు బెయిల్ కు దరఖాస్తుకు అవకాశం కల్పించినా ఆయన తిరస్కరించారు. దీంతో ఆయన వైగోకు 14రోజుల రిమాండ్ విధించారు.