ఉడుపి మఠాధిపతి అనుమానాస్పద మృతి.. విష ప్రయోగం జరిగిందా?
ప్రముఖ వైష్ణవ క్షేత్రం ఉడుపి శ్రీకృష్ణ ఆలయం అష్ట మఠాల్లో ఒకటైన శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామి (55) గురువారం నాడు మృతి చెందారు. బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను వైద్యం కోసం మణిపాల్లో కస్తూర్బా హాస్పిటల్లో చేర్పించారు.
Samayam Telugu 20 Jul 2018, 9:01 am
ప్రముఖ వైష్ణవ క్షేత్రం ఉడుపి శ్రీకృష్ణ ఆలయం అష్ట మఠాల్లో ఒకటైన శిరూరు మఠాధిపతి లక్ష్మీవర తీర్థ స్వామి (55) గురువారం నాడు మృతి చెందారు. బుధవారం తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను వైద్యం కోసం మణిపాల్లో కస్తూర్బా హాస్పిటల్లో చేర్పించారు. రక్తంతో కూడిన వాంతులు, తీవ్రమైన కడుపునొప్పితో బాధపడుతూ గురువారం ఉదయం హాస్పిటల్లోనే స్వామిజీ తుదిశ్వాశ విడిచారు. అయితే స్వామిజీ మృతిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. లక్ష్మీవర తీర్థపై విష ప్రయోగం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఆయన శరీరంలో విషం ఆనవాళ్లు ఉన్నట్టు గుర్తించి, పోలీసులకు సమాచారం అందజేసినట్టు కస్తూర్బా హాస్పిటల్ వైద్యులు వెల్లడించడమే దీనికి కారణం. మరోవైపు స్వామిజీ మృతిపై అనుమానాలున్నాయని ఆయన సోదరుడు ఫిర్యాదు చేయడంతో పోలీసులు రంగంలోకి దిగారు.
శిరూరు మఠాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టిన పోలీసులు, మూడు రోజుల పాటు ఇందులోకి ప్రవేశం నిషేధించారు. మధ్యపరంపర కట్టుబాట్లను ఉల్లంఘించారనే ఆరోపణల్ని లక్ష్మీవర తీర్థ ఎదుర్కొంటున్నారు. యతి సంప్రదాయాన్ని పెద్దగా పాటించకుండా మఠాధిపతులు కన్నెర్రకు గురయ్యారు. అయితే,
లక్ష్మీవర తీర్థ తరఫున లాయర్ రవి కిరణ్ మాట్లాడుతూ... జూన్ 28 న స్వామిజీ తనను సంప్రదించి, ఇతర మఠాధిపతులతో ఉన్న విభేదాలు గురించి రెండు గంటలపాటు చర్చించినట్టు తెలిపారు. ఈ మఠాలకు వ్యతిరేకంగా ఉడుపి కోర్టులో కేవియట్ దాఖలు చేసినట్టు తెలియజేశారు. అలాగే ప్రధాన మఠంలో శ్రీకృష్ణుని విగ్రహం ఉంచడం పట్ల చాలా నిరాశతో ఉన్నారని, దీనిపై కూడా తనతో చర్చించి, కేసు వేయడానికి సిద్ధపడుతోన్న తరుణంలో ఆయన అర్థాంతరంగా మృతి చెందారని లాయర్ రవి కిరణ్ అన్నారు.
ఆయన మరణంపై పలు అనుమానాలున్నాయని, దీనిపై శాస్త్రీయపరమైన విచారణ చేపట్టాలని లాయర్ డిమాండ్ చేశారు. మరోవైపు స్వామిజీది అసహజ మరమని తేలితే విచారణకు ఆదేశిస్తామని కర్ణాటక సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర మాట్లాడుతూ.. స్వామిజీ మృతి చెందడం చాలా దురదృష్టకరం... అలాగే ఆయన ఎలా చనిపోయారో తెలియదు.. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, దీని వెనుక బలమైన కారణం ఉంటే పోలీసులు తప్పనిసరిగా కేసు నమోదుచేసి విచారణ చేపడతారని పేర్కొన్నారు. గురువారం రాత్రి ఉడుపి హిరియడకలోని శిరూరు మూల మఠం ఆవరణలో స్వామిజీ అంత్యక్రియలు నిర్వహించి బృందావనం పూర్తిచేశారు.
శిరూరు మఠాన్ని స్వాధీనం చేసుకుని తనిఖీలు చేపట్టిన పోలీసులు, మూడు రోజుల పాటు ఇందులోకి ప్రవేశం నిషేధించారు. మధ్యపరంపర కట్టుబాట్లను ఉల్లంఘించారనే ఆరోపణల్ని లక్ష్మీవర తీర్థ ఎదుర్కొంటున్నారు. యతి సంప్రదాయాన్ని పెద్దగా పాటించకుండా మఠాధిపతులు కన్నెర్రకు గురయ్యారు. అయితే,
లక్ష్మీవర తీర్థ తరఫున లాయర్ రవి కిరణ్ మాట్లాడుతూ... జూన్ 28 న స్వామిజీ తనను సంప్రదించి, ఇతర మఠాధిపతులతో ఉన్న విభేదాలు గురించి రెండు గంటలపాటు చర్చించినట్టు తెలిపారు. ఈ మఠాలకు వ్యతిరేకంగా ఉడుపి కోర్టులో కేవియట్ దాఖలు చేసినట్టు తెలియజేశారు. అలాగే ప్రధాన మఠంలో శ్రీకృష్ణుని విగ్రహం ఉంచడం పట్ల చాలా నిరాశతో ఉన్నారని, దీనిపై కూడా తనతో చర్చించి, కేసు వేయడానికి సిద్ధపడుతోన్న తరుణంలో ఆయన అర్థాంతరంగా మృతి చెందారని లాయర్ రవి కిరణ్ అన్నారు.
ఆయన మరణంపై పలు అనుమానాలున్నాయని, దీనిపై శాస్త్రీయపరమైన విచారణ చేపట్టాలని లాయర్ డిమాండ్ చేశారు. మరోవైపు స్వామిజీది అసహజ మరమని తేలితే విచారణకు ఆదేశిస్తామని కర్ణాటక సీఎం కుమారస్వామి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం పరమేశ్వర మాట్లాడుతూ.. స్వామిజీ మృతి చెందడం చాలా దురదృష్టకరం... అలాగే ఆయన ఎలా చనిపోయారో తెలియదు.. దీనిపై ఎవరూ ఫిర్యాదు చేయలేదని, దీని వెనుక బలమైన కారణం ఉంటే పోలీసులు తప్పనిసరిగా కేసు నమోదుచేసి విచారణ చేపడతారని పేర్కొన్నారు. గురువారం రాత్రి ఉడుపి హిరియడకలోని శిరూరు మూల మఠం ఆవరణలో స్వామిజీ అంత్యక్రియలు నిర్వహించి బృందావనం పూర్తిచేశారు.