యాప్నగరం

రైలు పట్టాలపై ముగ్గురి ప్రాణం తీసిన సెల్ఫీ

సెల్ఫీ మీదున్న మోజు ముగ్గురు మిత్రుల ప్రాణాలు బలిగొనడమేకాకుండా మరో ఇద్దరిని ప్రాణపాయ స్థితిలోకి నెట్టేసిన దుర్ఘటన...

TNN 14 Apr 2017, 12:24 pm
సెల్ఫీ మీదున్న మోజు ముగ్గురు మిత్రుల ప్రాణాలు బలిగొనడమేకాకుండా మరో ఇద్దరిని ప్రాణపాయ స్థితిలోకి నెట్టేసిన దుర్ఘటన ఇది. పశ్చిమబెంగాల్‌లోని హౌరా సమీపంలో బందెల్ లోకల్ ట్రైన్‌లో ప్రయాణిస్తున్న ఐదుగురు మిత్రులు సెల్ఫీ తరహాలో ఓ గ్రూఫీ తీసుకోవాలని ప్రయత్నించారు. అది కూడా ప్రయాణిస్తున్న రైలు డోర్ వద్ద నిలబడి గ్రూఫీకి ఫోజివ్వాలనుకున్నారు. ఈ క్రమంలోనే సెల్ఫీ స్టిక్‌తో గ్రూఫీకి ప్రయత్నించిన తర్ అక్ మన్నా అనే 22 ఏళ్ల యువకుడు రైలు పట్టాల పక్కనే వున్న లైట్ స్తంభానికి తగిలి కిందపడిపోయాడు.
Samayam Telugu selfie craze claims lives of three youth
రైలు పట్టాలపై ముగ్గురి ప్రాణం తీసిన సెల్ఫీ


బేలూరు-లీలా స్టేషన్ల మధ్య ఈ ఘటన జరగగా తర్వాతి స్టేషన్‌లో రైలు దిగిన మిగతా నలుగురు యువకులు వెంటనే మన్నా పడిపోయిన ఘటనస్థలికి పరుగులు తీశారు. మన్నాని కాపాడాలనే ఉద్దేశంలో అక్కడికి వేగంగా పరుగులు తీశారే కానీ అదే సమయంలో వాళ్లు పరుగులు తీస్తున్న రైలు పట్టాలపై మరో రైలు వస్తోందనే సంగతి గమనించలేకపోయారు. వాళ్లు ప్రమాదం గమనించి, పక్కకు తప్పుకునే లోపే రైలు ముగ్గురిని ఢీకొట్టి వారిపైనుంచి వెళ్లిపోయింది. రైలు చక్రాల కింద నలిగిన సుమిత్ కుమిర్, చందన్ పొల్లే, కాజల్ సహా ముగ్గురూ 20 ఏళ్ల వయస్సు వారే. అదృష్టవశాత్తు వారిలో కాజల్ బిశ్వాస్ అనే మరో యువకుడు మాత్రం ప్రమాదం నుంచి గాయాలతో బయటపడగలిగాడు.

ఇదిలావుంటే, లైట్ స్తంభం ఢీకొని రైలు నుంచి కిందపడిపోయిన మన్నాని తర్వాత స్థానికులు కాపాడి హౌరా జిల్లా ఆస్పత్రిలో చేర్పించినప్పటికీ అతడి పరిస్థితి విషమంగానే వుందని తెలుస్తోంది. విచిత్రం ఏంటంటే, ఈ ఘటన జరగడానికి సరిగ్గా రెండు గంటల ముందే వీరి తరహాలోనే సెల్ఫీ కోసం ప్రయత్నిస్తూ ఇదే బందేల్ లోకల్ రైలు నుంచి కింద పడిపోయాడు. గాయాలపాలైన ఆ యువకుడిని కూడా హౌరా జరనల్ ఆస్పత్రిలో చేర్పించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.