యాప్నగరం

ఢిల్లీకి నూతన పోలీసు కమిషనర్‌.. గతంలో ఎక్కడ పని చేశారంటే..

అల్లర్లతో అట్టుడుకుతున్న ఢిల్లీ నగరానికి కేంద్రం కొత్త పోలీసు కమిషనర్‌ను నియమించింది. అమూల్య పట్నాయక్ స్థానంలో మార్చి 1 నుంచి ఎస్ఎన్ శ్రీవాస్తవ బాధ్యతలు చేపడతారు.

Samayam Telugu 28 Feb 2020, 3:43 pm
ఢిల్లీకి కొత్త పోలీసు కమిషనర్ వచ్చారు. సీనియర్ ఐపీఎస్ అధికారి ఎస్.ఎన్. శ్రీవాస్తవకు ఢిల్లీ పోలీసు కమిషనర్‌గా కేంద్రం అదనపు బాధ్యతలు అప్పగించింది. మార్చి 1 నుంచి తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఆయన ఈ బాధ్యతల్లో కొనసాగుతారు. 1985 బ్యాచ్‌ అరుణాచల్ - గోవా - మిజోరాం కేంద్రపాలిత ప్రాంతం కేడర్‌కు చెందిన శ్రీవాస్తవను ఈ వారం ఆరంభంలో సీఆర్పీఎఫ్ నుంచి తీసుకొచ్చి స్పెషల్ పోలీసు కమిషనర్ (లా అండ్ ఆర్డర్‌)గా నియమించారు. ఢిల్లీ అల్లర్లను అరికట్టడం కోసం ఆయనకు ఈ బాధ్యతలు అప్పగించారు.
Samayam Telugu sn srivastava


ఢిల్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత పోలీసు కమిషనర్ అమూల్య పట్నాయక్ పదవీ కాలాన్ని ఒక నెల పొడిగించారు. ఆయన ఫిబ్రవరి 29న రిటైర్ అవుతున్నారు. కానీ సీఏఏ అల్లర్లను అరికట్టడంలో విఫలమయ్యారనే ఆరోపణలు ఆయనపై వచ్చాయి. ఈ అల్లర్లలో ఇప్పటి వరకూ 42 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే.

పౌరులకు భద్రత కల్పించడం, పోలీసులు ఉంది తమకోసమే అని భావన ప్రజల్లో కల్పించడమే తన తొలి ప్రాధాన్యమని శ్రీవాస్తవ పీటీఐతో తెలిపారు. శ్రీవాస్తవ జమ్మూకశ్మీర్ జోన్ సీఆర్పీఎఫ్ స్పెషల్ డీజీగా పని చేశారు. సైన్యంపై రాళ్లు రువ్విన అల్లరి మూకలను ఆయన సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. ఇండియన్ ముజాహిద్దీన్‌పై విచారణ కోసం ఏర్పాటు చేసిన ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ బాధ్యతలను కూడా శ్రీవాస్తవ గతంలో పర్యవేక్షించారు. ఆయన బీటెక్, ఎల్ఎల్‌బీ చదువుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.