యాప్నగరం

మరో సీనియర్ జర్నలిస్టు దారుణ హత్య?

జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యోదంతం మరవకముందే పంజాబ్‌లో మరో సీనియర్‌ జర్నలిస్టు హత్యకు గురయ్యారు. మొహాలీ ప్రాంతంలో జర్నలిస్టు కేజీ సింగ్‌ (62), ఆయన తల్లి గురుచరణ్‌ కౌర్‌ (92) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు.

TNN 23 Sep 2017, 4:39 pm
జర్నలిస్టు గౌరీ లంకేశ్ హత్యోదంతం మరవకముందే పంజాబ్‌లో మరో సీనియర్‌ జర్నలిస్టు హత్యకు గురయ్యారు. మొహాలీ ప్రాంతంలో జర్నలిస్టు కేజీ సింగ్‌ (62), ఆయన తల్లి గురుచరణ్‌ కౌర్‌ (92) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గురుచరణ్ కౌర్ నివాసంలో వీరిద్దరూ విగతజీవులై కనిపించారు. శనివారం (సెప్టెంబర్ 23) మధ్యాహ్నం ఓ వ్యక్తి సింగ్‌ను కలవడానికి ఆయన ఇంటికి వెళ్లాడు. అయితే ఎంతకీ వారు తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి అతడు పోలీసులకు సమాచారమిచ్చాడు. పోలీసులు వచ్చి లోపలికెళ్లి చూడగా.. సింగ్‌ రక్తపుమడుగులో పడి ఉన్నారు. పక్కనే ఆయన తల్లి మృతదేహం కూడా ఉంది.
Samayam Telugu senior journalist singh and his mother found dead in mohali
మరో సీనియర్ జర్నలిస్టు దారుణ హత్య?


సింగ్‌‌ను గొంతు కోసి, ఆయన తల్లిని గొంతు నులుమి చంపి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సింగ్‌ కారు కూడా కనిపించకుండా పోయినట్లు పోలీసులు తెలిపారు. సింగ్‌ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌, ది ట్రిబ్యూన్‌ లాంటి పత్రికల్లో ఎడిటర్‌గా పనిచేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.