యాప్నగరం

New Attorny General కొత్త ఏజీగా ముకుల్ రోహత్గీ.. మరోసారి కేంద్రం అవకాశం!

అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ పదవీకాలం ఈ నెలాఖరుతో ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త ఏజీ నియామాకం కోసం కేంద్రం కసరత్తు చేస్తోంది. అయితే, గతంలో ఏజీగా ఉన్న సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీనే మళ్లీ నియమించనున్నట్టు తెలుస్తోంది.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 13 Sep 2022, 4:04 pm

ప్రధానాంశాలు:

  • ఏజీగా మరోసారి ముకుల్ రోహత్గీకి అవకాశం
  • ముగియనున్న వేణుగోపాల్ పదవీకాలం
  • కీలక కేసుల్లో వాదనలు వినిపించిన రోహత్గీ.
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ముకుల్ రోహత్గీ
సీనియర్‌ న్యాయవాది ముకుల్‌ రోహత్గి (67) మరోసారి అటార్నీ జనరల్‌ (ఏజీ)గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుత ఏజీ కేకే వేణుగోపాల్‌ రిటైర్మెంట్‌ తర్వాత ఆయన స్థానంలో తిరిగి రోహత్గి బాధ్యతలను చేపట్టనున్నారని తెలిపాయి. గతంలో ఏజీగా పనిచేసిన రోహత్గి 2017లో బాధ్యతల నుంచి తప్పుకోవడంతో 15వ అటార్నీ జనరల్‌గా కేకే వేణుగోపాల్‌ను కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆ తర్వాత ఏజీ వేణుగోపాల్‌ పదవీకాలాన్ని పొడిగించారు. అది కూడా ఈ ఏడాది సెప్టెంబర్‌ 30తో ముగియనుండగా.. మరోసారి రోహత్గివైపే ప్రభుత్వం మొగ్గుచూపినట్టు సమాచారం.
వేణుగోపాల్ మూడేళ్ల పదవీకాలం 2020లోనే ముగిసింది. అప్పటికే ఆయన వయస్సు దాదాపు 89 ఏళ్లు. తన వయస్సును దృష్టిలో ఉంచుకుని విశ్రాంతిని ఇవ్వాలని అప్పట్లో వేణుగోపాల్‌ కేంద్రాన్ని కోరారు. కానీ, కేంద్రం మరో మూడేళ్లపాటు పదవిలో కొనసాగమని ఆయన అభ్యర్థించడంతో కాదనలేకపోయారు. ప్రస్తుతం వేణుగోపాల్ వయసు 91 ఏళ్లు కావడంతో ఇక అటార్నీ జనరల్‌గా కొనసాగలేనని స్పష్టం చేశారు. కొత్త ఏజీగా ముకుల్‌ రోహత్గి పదవీకాలం అక్టోబర్‌ 1 నుంచి మొదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఏజీగా 2017లో ముకుల్ రోహత్గీ బాధ్యతల నుంచి తప్పుకున్నా జమ్మూ కశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్ 370 రద్దు వంటి పలు సున్నితమైన న్యాయ అంశాల్లో ఆయన సలహాలను తీసుకున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రోహత్గీ ఏజీగా నియమితులయ్యారు. దేశంలోనే అత్యంత పేరుమోసిన లాయర్లలో ఒకరైన రోహిత్గీ అనేక కీలక కేసులను ఛాలెంజ్‌గా తీసుకుని విజయం సాధించారు. 2002 నాటి గుజరాత్ అల్లర్ల కేసులో ప్రభుత్వ తరఫున వాదనలు వినిపించారు. అలాగే, జాతీయ జ్యుడీషియల్ అపాయింట్‌మెంట్ కమిషన్ కేసు, గతేడాది డ్రగ్స్ కేసులో అరెస్టయిన బాలీవుడ్ నటుడు షారుక్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ తరఫున వాదించారు.
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.