యాప్నగరం

అధ్యక్ష పదవి నుంచి రాహుల్ పారిపోవడమే ఓ పెద్ద ఓటమి: కాంగ్రెస్ నేత

మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు.. సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయానికి తోడు కాంగ్రెస్ అధ్యక్ష బాధ్యతలు నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడంతో ఆ పార్టీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

Samayam Telugu 9 Oct 2019, 2:58 pm
సొంతపార్టీపైనే కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. పార్టీ అధ్యక్ష బాధ్యతలు నుంచి రాహుల్ గాంధీ తప్పుకోవడమే అతిపెద్ద ఓటమని ఆయన వ్యాఖ్యానించారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపై ఇంతవరకూ ఆత్మ పరిశీలన చేసుకోలేదని, దీనిని సమీక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. ఎందుకు ఓడిపోయామో కూర్చుని మాట్లాడకోకుండా, తమనేత పారిపోవడమే అతిపెద్ద ఓటమని పేర్కొన్నారు. ఓటమికి నైతిక బాధ్యతవహిస్తూ అధ్యక్ష పదవికి రాహుల్ రాజీనామా చేశారు.. కానీ, ఆయన కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు నుంచి పదేపదే చేసిన విజ్ఞప్తులను విస్మరించారన్నారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష పదవికి రాహుల్ గాంధీ రాజీనామా చేసిన తర్వాత ఓ కాంగ్రెస్ నేత ఆయనపై ఘాటు వ్యాఖ్యలు చేయడం ఇదే తొలిసారి.
Samayam Telugu rahul


రాహుల్ రాజీనామాతో పార్టీలో ఒక శూన్యత ఏర్పడిందని, తిరిగి అధ్యక్ష బాధ్యతలను సోనియా గాంధీ స్వీకరించడం తాత్కాలికమేనని భావిస్తున్నామని ఖుర్షీద్ తెలిపారు. రాహుల్ రాజీనామాను తాను సమర్ధించడంలేదని, కార్యకర్తలు కూడా ఆయనే అధ్యక్షుడిగా కొనసాగాలని కోరుకుంటున్నారని అన్నారు. అధ్యక్షుడు తప్పుకోవడం ఒక విధంగా పార్టీ శూన్యతను ఎదుర్కొంటోందని, సోనియా గాంధీ బాధ్యతలు చేపట్టినా అంతగా ప్రభావం చూపలేకపోతున్నారని అన్నారు. తాను పార్టీ వీడుతాననే ప్రచారాన్ని ఖుర్షీద్ కొట్టిపారేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత దేశంలోనూ, కాంగ్రెస్ పార్టీలోనూ పరిస్థితి ఒకేలా ఉందని, తాను పార్టీ వీడుతానని చేస్తున్న ప్రచారంలో నిజంలేదని కొట్టిపారేశారు. ఏం జరిగినా తాను కాంగ్రెస్‌ను వీడబోనని, పార్టీ నుంచి అన్ని రకాలుగా లబ్ది పొంది కష్టకాలంలో బయటకు వెళ్లిపోయినవారిలా కాదని ఖుర్షీద్ స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.