యాప్నగరం

గర్భిణిని హాస్పిటల్‌కు తీసుకెళ్తుండగా ఘోర ప్రమాదం..

Kalaburagi: కర్ణాటకలోని కలబురిగిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఆగి ఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో గర్భిణితో పాటు ఆరుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. అతివేగమే ఈ విషాదానికి కారణమని తెలుస్తోంది.

Samayam Telugu 27 Sep 2020, 5:19 pm
రి కొన్ని గంటల్లో తమ ఇంట్లోకి మరో కొత్త వ్యక్తి రాబోతున్నాడనే ఆనందం వారిది. నిండు గర్భిణిని తీసుకొని కుటుంబమంతా కలిసి కారులో హాస్పిటల్‌కి బయలుదేరారు. కానీ, మార్గమధ్యలో రోడ్డు ప్రమాదం రూపంలో వారిని మృత్యువు కబళించింది. కర్ణాటకలోని కలబురిగిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గర్భిణి సహా ఏడుగురు వ్యక్తులు దుర్మరణం పాలయ్యారు. ఆగి ఉన్న లారీని కారు ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ప్రమాదానికి అతి వేగమే కారణమని తెలుస్తోంది.
Samayam Telugu కర్ణాటక రోడ్డు ప్రమాదం
Kalaburagi road accident


కలబురిగి సమీపంలోని సవలగి గ్రామం సమీపంలో ఆదివారం (సెప్టెంబర్ 27) ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మృతులందరూ అలంద్ పట్టణానికి చెందినవారని పోలీసులు తెలిపారు. మరణించిన వారిలో 25 ఏళ్ల గర్భిణి ఇర్ఫానా బేగంతో పాటు రుబియా బేగం (50), అబేదాబి (50), జయ చునాబి (60), మునీర్‌ (28), మహమ్మద్‌ అలీ (38), షౌకత్‌ అలీ (29)ఉన్నారని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

Also Read: తనను డోలీలో మోసిన కూలీల కాళ్లకు దండం పెట్టిన బాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.