యాప్నగరం

Prayagraj Sweeper: ఖాతాలో కళ్లు చెదిరే డబ్బు.. అనుభవించకుండానే పోయిన బిచ్చగాడు

మంచి ఉద్యోగం.. మంచి జీతం.. కానీ ఏం లాభం.. వచ్చిన డబ్బును అనుభవించకుండానే ఓ వ్యక్తి చనిపోయాడు. క్షయవ్యాధితో బాధపడుతూ ప్రాణాలు కోల్పోయాడు. యూపీలోని ప్రయాగ్ రాజ్‌లో (Prayagraj Sweeper) ధీరజ్ అనే వ్యక్తి.. స్వీపర్‌గా ఉద్యోగం చేశాడు. అయితే తన అకౌంట్‌లో పడిన సేలరీ అస్సలు ముట్టలేదు. పదేళ్లుగా పైసా తీయలేదు. బిక్షాటన చేసుకుంటూ వచ్చిన డబ్బుతో బతికాడు. క్షయతో బాధపడుతూ ఆదివారం మరణించాడు. అతను చనిపోయాక చూస్తే అతిన అకౌంట్‌లో ఏకంగా రూ.70 లక్షలు ఉంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 5 Sep 2022, 9:01 pm

ప్రధానాంశాలు:

  • పదేళ్లుగా ఖాతా నుంచి పైసా తీయని ధీరజ్
  • ప్రయాగరాజ్‌లో స్వీపర్‌గా ఉద్యోగం
  • భిక్షాటన చేసి వచ్చిన డబ్బుతో బతికిన ధీరజ్
  • ధీరజ్ అకౌంట్‌లో రూ.70 లక్షలు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Prayagraj Sweeper
Prayagraj Sweeper: ఉత్తరప్రదేశ్‌లో ఓ వ్యక్తి స్వీపర్ ఉద్యోగం చేసి పదేళ్లుగా తన బ్యాంకు ఖాతాలో పడిన జీతం నుంచి ఒక్క పైసా కూడా తీయలేదు. భిక్షాటనతో వచ్చిన డబ్బుతోనే కాలం గడిపేశాడు. ఇప్పుడా వ్యక్తి చనిపోయాడు. అతని ఖాతాలో కళ్లు చెదిరేంత డబ్బు ఉంది. ప్రయాగరాజ్‌కు చెందిన ధీరజ్ కుష్టు వ్యాధి ఆస్పత్రిలో స్వీపర్‌గా పనిచేసేవాడు. ఆ ఉద్యోగం అతని తండ్రి మరణాంతరం పొందాడు.
అయితే ధీరజ్ తన జీతం డబ్బును బ్యాంక్‌ నుంచి తీసుకోలేదు. పదేళ్ల నుంచి పైసా కూడా తీసుకోలేదు. తన అవసరాల భిక్షాటన చేసుకునేవాడు. వచ్చి ఆ డబ్బుతో బతికేవాడు. ప్రతి ఏటా ఐటీ రిటర్న్స్‌ మాత్రం ఫైల్ చేసేవాడు. అయితే ధీరజ్ అనూహ్యంగా ఆదివారం తెల్లవారుజామున ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు ఆయన అకౌంట్‌లో రూ.70 లక్షలు ఉంది.

తండ్రి బాటలోనే..
విచిత్రం ఏమిటంటే ధీరజ్ తండ్రి కూడా ఇలాగే చేశాడు. తన జీతం డబ్బును వాడకుండా.. రోడ్డుపై భిక్షాటన చేసుకుంటూ జీవించాడు. ధీరజ్ కూడా అదే కొనసాగించాడు. అందరూ ఇచ్చిన డబ్బుతో, 80 ఏళ్ల తన తల్లికి వచ్చిన పెన్షన్‌ డబ్బులతో ఇద్దరు బతికేశారు. ప్రతి నెలా వచ్చిన జీతం డబ్బును ఖాతా నుంచి తీయకపోవడంతో.. అవి ఏకంగా లక్షలాది రూపాయలు అయ్యాయి. ఆ డబ్బు గురించి కొన్ని నెలల కిందట ఐటీ అధికారులు ధీరజ్‌ని ప్రశ్నించారు. ధీరజ్ చెప్పిన సమాధానంతో వారు వదిలేశారు. అప్పుడే ధీరజ్ వార్తల్లో నిలిచాడు. జీతంలో పైసా కూడా తీయని వ్యక్తిగా హాట్‌టాపిక్ అయ్యాడు.

డబ్బు కోసమే పెళ్లి వద్దనుకున్నాడు..
ఇంకా విచిత్రమేమిటంటే.. తన దగ్గర డబ్బు గురించి.. వాటితో పారిపోతుందేమోననే భయంతో ధీరజ్ పెళ్లి కూడా చేసుకోలేదు. తల్లితో మాత్రమే ఉంటున్నాడు. దురదృష్ట వశాత్తు ధీరజ్ క్షయ వ్యాధితో బాధపడుతూ ఆదివారం చనిపోయాడు. ధీరజ్‌ చనిపోయాక బ్యాంకు ఖాతాలో రూ.70 లక్షలు ఉన్నట్లు తెలిసిందని అతడి స్నేహితుడు వెల్లడించాడు. ఇది తెలిసినవారంతా.. లక్షలు కూడబెట్టినా ఏ ప్రయోజనం అనుభవించకుండానే పోయాడనుకుంటున్నారు.

Read Also:ప్రాణాలనే పణంగా పెట్టింది... ఆ బిడ్డ తల్లి ధైర్యానికి సాహో అనాల్సిందే..!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.