యాప్నగరం

చినాబ్‌ నదిలో పడిన మినీ బస్సు.. పది మందికిపైగా దుర్మరణం?

జమ్మూ కశ్మీర్లో బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. చినాబ్ నదిలోకి ఓ మినీ బస్సు దూసుకెళ్లిన ఘటనలో పది మందికిపైగా మరణించినట్టు తెలుస్తోంది.

Samayam Telugu 14 Sep 2018, 11:19 am
జమ్మూ కశ్మీర్: కొండగట్టు బస్సు ప్రమాదం కళ్ల ముందు కదలాడుతుండగానే.. మరో ప్రమాదం చోటు చేసుకుంది. మినీ బస్సు చినాబ్ నదిలో పడిన ఘటనలో పది మందికిపైగా మరణించారని భావిస్తున్నారు. శుక్రవారం ఉదయం జమ్మూ కశ్మీర్లోని కిష్ట్వార్ జిల్లాలోని థాక్రీ సమీపంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. చాలా మందికి గాయాలైనట్టు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. బస్సు అదుపు తప్పి లోయలోకి వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగిందని భావిస్తున్నారు.
Samayam Telugu chinab accident


ప్రమాదం సమాచారం అందుకున్న జమ్మూ కశ్మీర్ పోలీసులు, స్థానిక యంత్రాంగం వెంటనే సంఘటనా స్థలికి సహాయక చర్యలు చేపట్టారు. స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని బాధితులకు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రమాదానికి గురైన మినీ బస్సు నంబర్‌ను JK17 0662గా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 25 మంది ప్రయాణిస్తున్నట్టు ఓ అధికారి తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.