యాప్నగరం

శనిశింగనాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

మహిళా సామాజికవేత్తలు మహారాష్ట్రాలో ఉన్న శనిసింగనాపూర్ దేవాలయానికి ర్యాలీగా తరలివెళ్లారు.

TNN 2 Apr 2016, 3:17 pm
మహిళలు మగవారితో సమానంగా అన్ని ఆలయాల్లోకి ప్రవేశించవచ్చని... వారిని అడ్డుకునే హక్కు ఎవరికీ లేదని ముంబై హైకోర్టు శుక్రవారం తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. దీంతో మహిళా సామాజికవేత్తలు మహారాష్ట్రాలో ఉన్న శనిసింగనాపూర్ దేవాలయానికి ర్యాలీగా తరలివెళ్లారు. భూమాత మహిళా సంఘం నేత తృప్తి దేశాయ్ నాయకత్వంలో మహిళలు కొంతమంది కలిసి శనిసింగనాపూర్ ఆలయంలోని ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వారిని స్థానికులు అడ్డుకున్నారు. లోపలికి వెళ్లనీయలేదు. ఇరువర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పోలీసులు భారీగా మోహరించారు. ఆందోళన చేస్తూనే మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు. అక్కడ ఇంకా పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంది.
Samayam Telugu shani shingnapur row women prevented from entering core shrine area
శనిశింగనాపూర్‌లో ఉద్రిక్త పరిస్థితులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.