యాప్నగరం

ఆ న్యూస్ ఎడిటర్‌పై మరో కేసు..!

గతంలో పని చేసిన న్యూస్ ఛానెల్ నుంచి కొన్ని వీడియో టేపులు ఎత్తుకెళ్లినట్లు ఇప్పటికే గోస్వామిపై ఓ కేసు నమోదైంది..

TNN 27 May 2017, 6:40 pm
సీనియర్ జర్నలిస్టు, న్యూస్ ఎడిటర్ అర్ణాబ్ గోస్వామిపై కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ రూ. 2 కోట్ల‌ ప‌రువు న‌ష్టం దావా వేశారు. అర్ణాబ్‌తో పాటు ఆయ‌న ఛాన‌ల్ రిపబ్లిక్ టీవీపై డిల్లీ హైకోర్టులో ఈ కేసు దాఖలు చేశారు. శశి థరూర్ ప‌రువుకు భంగం క‌లిగించేలా రిప‌బ్లిక్ టీవీలో క‌థ‌నాలు ప్ర‌సారం చేశారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. థరూర్ భార్య సునందా పుష్క‌ర్ మృతికి సంబంధించిన కేసు కోర్టులో విచారణ దశలో ఉండగానే ఆయన ఇమేజ్‌కు డ్యామేజ్ కలిగేలా వార్తా కథనాలు ప్ర‌సారం చేశార‌ని ఆయన చెప్పారు. దక్షిణ డిల్లీలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్‌లో 2014 జనవరి 17న సునందా పుష్కర్ అనుమానాస్పద రీతిలో మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసు ఇంకా విచారణలో ఉంది.
Samayam Telugu shashi tharoor files defamation suit against arnab goswami in high court
ఆ న్యూస్ ఎడిటర్‌పై మరో కేసు..!


మే 8 నుంచి 13 వ‌ర‌కు థరూర్ భార్య మృతికి సంబంధించి రిప‌బ్లిక్ టీవీలో అర్ణాబ్ వరస క‌థ‌నాలు ప్ర‌సార‌ం చేశారని ఆయన తరఫు న్యాయవాది తెలిపారు. ఈ కేసులో అర్ణాబ్‌తో పాటు రిపబ్లిక్ టీవీ మేనేజ్‌మెంట్‌ ఆసియా నెట్ న్యూస్ ప్రైవేట్ లిమిటెడ్‌ను కూడా ప్రతివాదిగా చేర్చారు. గతంలో పని చేసిన న్యూస్ ఛానెల్ నుంచి కొన్ని వీడియో టేపులు ఎత్తుకెళ్లినట్లు ఇప్పటికే అర్ణాబ్ గోస్వామిపై ఓ కేసు నమోదైన విషయం తెలిసిందే.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.