యాప్నగరం

హిమాచల్‌ ప్రదేశ్‌లో బస్సు బోల్తా... 44 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లోని సిమ్లా జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఉత్తరాఖండ్ నుంచి హిమాచల్ ప్రదేశ్‌కు వస్తోన్న బస్సు నదిలో బొల్తా పడింది.

TNN 19 Apr 2017, 1:41 pm
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో 44 మంది ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. సిమ్లా, సిర్మౌర్ జిల్లా సరిహద్దుల్లోని మారుమూల ప్రాంతమైన నెర్వా సమీపంలో టాన్స్ నదిలో ప్రైవేట్ బస్సు బొల్తా పడటంతో ప్రయాణికుల్లోని 44 మంది అక్కడిక్కడే మరణించారు. ఉత్తరాఖండ్‌లోని టియూని నుంచి ఉదయం 56 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు నెర్వా సమీపంలో ప్రమాదానికి గురైనట్లు అధికార వర్గాలు పేర్కొన్నాయి. మృతుల‌ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని పోలీసులు తెలియజేశారు.
Samayam Telugu shimla bus accident at least 44 dead after bus falls into tons river
హిమాచల్‌ ప్రదేశ్‌లో బస్సు బోల్తా... 44 మంది మృతి


గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న సిమ్లా పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. నదిలో పడిపోయిన బస్సును బయటకు తీయడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. నెర్వా పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రమాదానికి గురైన బస్సులో 56 మంది ప్రయాణిస్తున్నట్లు సిమ్లా ఎస్సీ డీడబ్ల్యూ నేగి పేర్కొన్నారు. గాయపడిని వారిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించినట్లు ఎస్పీ తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.