రిజర్వేషన్లు కోరతూ మరాఠా వర్గం చేస్తున్న ఆందోళనలతో మహారాష్ట్ర అట్టుడుకుతోన్న పరిస్థితుల్లో మిత్రపక్షమైన బీజేపీని శివసేన కవ్వించింది. ఈ సమస్యను పరిష్కరించడానికి ఫడ్నవీస్ స్థానంలో రాష్ట్ర మంత్రి పంకజ ముండేను ఒక్క గంటపాటు సీఎం చేయాలని సూచించింది. గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా పని చేస్తోన్న పంకజ ముండే.. మరాఠాల ఆందోళన విషయమై ఇటీవల మాట్లాడుతూ తనకే అధికారం ఉంటే.. ఆలస్యం చేయకుండా నిర్ణయం తీసుకునేదాన్ని అని తెలిపారు.
మరాఠాల రిజర్వేషన్ ఫైల్ నా టేబుల్ మీదుంటే ఏ మాత్రం ఆలస్యం చేసే దాన్ని కాదు. హైకోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల ఈ అంశం పెండింగ్లో ఉందని ఆందోళనకారులకు ముండే తెలిపారు. పంకజ ముండే మాటలను శివసేన తన పత్రిక సామ్నాలో ప్రాస్తావించింది.
‘‘అందరి సమ్మతితో ఆమెను కనీసం గంట సేపు సీఎం చేయాలి. అలా చేస్తే మరాఠా రిజర్వేషన్ల సమస్య పరిష్కారం అవుతుంద’’ని శివసేన వ్యాఖ్యానించింది. ‘హార్దిక్ పటేల్ను జైలుకు పంపడం ద్వారా గుజరాత్లో పటేళ్ల ఆందోళనను బీజేపీ అణగదొక్కింది. మహారాష్ట్రలోనూ అదే ఫార్ములా అనుసరిస్తోంద’ని శివసేన మండిపడింది.
మహారాష్ట్రలో రాజకీయంగా బలమైన సామాజికవర్గమైన మరాఠాలు.. ఆ రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్నారు. తమకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు ఆందోళనలు చేస్తున్నారు. గతంలో వీరు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టారు. కానీ జూలై 23న ఓ ఆందోళనకారుడు గోదావరి నదిలో దూకడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.
మరాఠాల రిజర్వేషన్ ఫైల్ నా టేబుల్ మీదుంటే ఏ మాత్రం ఆలస్యం చేసే దాన్ని కాదు. హైకోర్టులో పెండింగ్లో ఉండటం వల్ల ఈ అంశం పెండింగ్లో ఉందని ఆందోళనకారులకు ముండే తెలిపారు. పంకజ ముండే మాటలను శివసేన తన పత్రిక సామ్నాలో ప్రాస్తావించింది.
‘‘అందరి సమ్మతితో ఆమెను కనీసం గంట సేపు సీఎం చేయాలి. అలా చేస్తే మరాఠా రిజర్వేషన్ల సమస్య పరిష్కారం అవుతుంద’’ని శివసేన వ్యాఖ్యానించింది. ‘హార్దిక్ పటేల్ను జైలుకు పంపడం ద్వారా గుజరాత్లో పటేళ్ల ఆందోళనను బీజేపీ అణగదొక్కింది. మహారాష్ట్రలోనూ అదే ఫార్ములా అనుసరిస్తోంద’ని శివసేన మండిపడింది.
మహారాష్ట్రలో రాజకీయంగా బలమైన సామాజికవర్గమైన మరాఠాలు.. ఆ రాష్ట్ర జనాభాలో 30 శాతం ఉన్నారు. తమకు 16 శాతం రిజర్వేషన్లు కల్పించాలని వారు ఆందోళనలు చేస్తున్నారు. గతంలో వీరు శాంతియుతంగా ఆందోళనలు చేపట్టారు. కానీ జూలై 23న ఓ ఆందోళనకారుడు గోదావరి నదిలో దూకడంతో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి.