యాప్నగరం

విమానం పక్కనపెట్టి రైలెక్కిన శివసేన ఎంపీ

పూణె నుంచి ఢిల్లీకి వెళ్లడానికి ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకున్న శివసేన ఎంపీ గైక్వాడ్, ఆ విమానాన్ని పక్కనపెట్టి..

TNN 10 Apr 2017, 1:54 pm
సోమవారం ఉదయం పూణె నుంచి ఢిల్లీకి వెళ్లడానికి అంతకన్నా ముందుగానే ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకున్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్.. ఆ విమానాన్ని పక్కనపెట్టి ముంబై నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఎక్కి ఢిల్లీ వెళ్లారు. "గైక్వాడ్ రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఢిల్లీకి చేరుకున్నారు. ఢిల్లీలో రైలు దిగిన అనంతరం నాకు ఫోన్ చేసి చేరుకున్నట్టు తెలిపారు. ముంబై రాజధాని ఎక్స్‌ప్రెస్ ముంబై సెంట్రల్ స్టేషన్ నుంచి బయల్దేరుతుంది. మళ్లీ ముంబైలోని బోరివలిలోనూ కాసేపు ఆగుతుంది. మరి గైక్వాడ్ ముంబై సెంట్రల్ స్టేషన్‌లో రైలు ఎక్కారా లేక బోరివలిలో ఎక్కారా అనేది నాకు కూడా తెలియదు. పార్లమెంట్ సమావేశాలు ముగిశాకా కూడా గైక్వాడ్ ఇంకొద్ది రోజులు ఢిల్లీలోనే వుండనున్నారు" అని అతడి సమీప అనుచరుడైన జీతేంద్ర షిండె టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.
Samayam Telugu shiv sena mp takes train instead of air india flight to go delhi
విమానం పక్కనపెట్టి రైలెక్కిన శివసేన ఎంపీ


ఎయిర్ ఇండియా విమానంలో టికెట్ బుక్ చేసుకుని, రైలులో వెళ్లడానికి గల కారణాలు ఏంటని ఆరాతీయగా... " ఈసారి గైక్వాడ్‌తో మరో నలుగురైదుగురు ఢిల్లీకి వెళ్తున్నారు. అందుకే విమాన ప్రయాణాన్ని విరమించుకుని రైలులో వెళ్లారు. అంతకుమించి ఇంకేం లేదు. ఎయిర్ ఇండియాతో అతడికున్న విభేధాలు తొలగిపోయాయి. జరిగిందేదో జరిగిపోయింది. అతడిపై ఎయిర్ లైన్స్ సంస్థలు నిషేధం కూడా ఎత్తివేశాయి. ఇక ఇప్పుడు దానిగురించి మాట్లాడటానికి ఇంకా ఏముంటుంది'' అని అన్నారు షిండే.

ఇదిలావుంటే, రవీంద్ర గైక్వాడ్ ఈరోజు తమ విమానం ఎక్కలేదని ఎయిర్ ఇండియా అధికార ప్రతినిధి టైమ్స్ ఆఫ్ ఇండియాకు తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.