యాప్నగరం

శివపాల్ పార్టీ ‘సమాజ్‌వాది సెక్యూలర్ మోర్చ’

ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చిన్నాన్న

Samayam Telugu 5 May 2017, 1:10 pm
ఎస్పీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ తమ్ముడు, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ చిన్నాన్న శివపాల్ యాదవ్ కొత్త రాజకీయపార్టీ స్థాపించారు. సమాజ్ వాది సెక్యూలర్ మోర్చగా నామకరణం చేసిన ఆయన పార్టీకి..ములాయం సింగ్ యాదవ్ అధినేతగా కొనసాగుతారని శివపాల్ వెల్లడించారు.
Samayam Telugu shivpal floats new political party samajwadi secular morcha
శివపాల్ పార్టీ ‘సమాజ్‌వాది సెక్యూలర్ మోర్చ’


‘ఈ పార్టీని త్వరలో అధికారికంగా ప్రారంభిస్తాం. ములాయంను గౌరవించాల్సిన బాధ్యత మాపై ఉంది’ అని శివపాల్ శుక్రవారం మీడియాతో చెప్పారు.

యూపీ అసెంబ్లీ ఎన్నికలకంటే ముందే ఎస్పీలో ములసం మొదలైంది. అప్పుడు సీఎంగా కొనసాగుతున్న అఖిలేష్-శివపాల్ యాదవ్ ల మధ్య విబేధాలు తారస్థాయికి చేరాయి. ఒకరిని మరొకరు బహిష్కరించుకోవడం వరకు వెళ్లింది. తండ్రి ములాయంను పార్టీ జాతీయ అధ్యక్షుడిగా తొలగించిన అఖిలేష్ తనను తాను పార్టీ చీఫ్ గా ప్రకటించుకున్నారు. ఆ తర్వాత మళ్లీ ఒక్కటయ్యారు.

ఆ సమయంలోనే పార్టీ ములాయంకు అప్పగించాలాని లేకపోతే కొత్తపార్టీ పెడ్తానని శివపాల్ అఖిలేష్ ను హెచ్చరించారు.

మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం ఫ్యామిలీ నుంచి శివపాల్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలిచారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.