సమాజ్ వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ బుధవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. వారం క్రితమే ములాయం రెండో తనయుడు ప్రీతిక్, కోడలు అపర్ణలు యోగిని కలిసిన విషయం తెలిసిందే.
వెంటనే అదే కుటుంబానికి చెందిన కీలక నేత శివపాల్ తన తనయుడు ఆదిత్య యాదవ్ ను వెంటబెట్టుకొని కాళీదాస్ మార్గ్ 5కు వెళ్లి..సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ములాయం తనయుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శివపాల్ మధ్య అంతర్గత విబేధాలున్నాయి. మొన్న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం కుటుంబం నుంచి ఎస్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఒకే ఒక్క నాయకుడు శివపాల్ యాదవ్.
అయితే తాను సీఎంను కలవడంతో ప్రత్యేక ఏమీ లేదని, యోగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అభినందించడానికి మర్యాద పూర్వకంగానే కలిశానని శివపాల్ తెలిపారు.
కాగా, సీఎం యోగితో శివపాల్ 15నిమిషాలపాటు సమావేశమయ్యారు.
వెంటనే అదే కుటుంబానికి చెందిన కీలక నేత శివపాల్ తన తనయుడు ఆదిత్య యాదవ్ ను వెంటబెట్టుకొని కాళీదాస్ మార్గ్ 5కు వెళ్లి..సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ములాయం తనయుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శివపాల్ మధ్య అంతర్గత విబేధాలున్నాయి. మొన్న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం కుటుంబం నుంచి ఎస్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఒకే ఒక్క నాయకుడు శివపాల్ యాదవ్.
అయితే తాను సీఎంను కలవడంతో ప్రత్యేక ఏమీ లేదని, యోగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అభినందించడానికి మర్యాద పూర్వకంగానే కలిశానని శివపాల్ తెలిపారు.
కాగా, సీఎం యోగితో శివపాల్ 15నిమిషాలపాటు సమావేశమయ్యారు.