యాప్నగరం

సీఎంను కలిసిన ములాయం బ్రదర్ శివపాల్

సమాజ్ వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ బుధవారం యూపీ

Samayam Telugu 5 Apr 2017, 6:06 pm
సమాజ్ వాదీపార్టీ వ్యవస్థాపకుడు ములాయం సింగ్ యాదవ్ సోదరుడు శివపాల్ యాదవ్ బుధవారం యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తో భేటీ అయ్యారు. వారం క్రితమే ములాయం రెండో తనయుడు ప్రీతిక్, కోడలు అపర్ణలు యోగిని కలిసిన విషయం తెలిసిందే.
Samayam Telugu shivpal meets cm yogi says it is a just curtsey call
సీఎంను కలిసిన ములాయం బ్రదర్ శివపాల్


వెంటనే అదే కుటుంబానికి చెందిన కీలక నేత శివపాల్ తన తనయుడు ఆదిత్య యాదవ్ ను వెంటబెట్టుకొని కాళీదాస్ మార్గ్ 5కు వెళ్లి..సీఎంను కలవడం ప్రాధాన్యత సంతరించుకున్నది.

ములాయం తనయుడు యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్, శివపాల్ మధ్య అంతర్గత విబేధాలున్నాయి. మొన్న జరిగిన యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ములాయం కుటుంబం నుంచి ఎస్పీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన ఒకే ఒక్క నాయకుడు శివపాల్ యాదవ్.

అయితే తాను సీఎంను కలవడంతో ప్రత్యేక ఏమీ లేదని, యోగి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక అభినందించడానికి మర్యాద పూర్వకంగానే కలిశానని శివపాల్ తెలిపారు.
కాగా, సీఎం యోగితో శివపాల్ 15నిమిషాలపాటు సమావేశమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.