సమాజ్ వాదీ పార్టీలో పుట్టిన ముసలం ఇప్పట్లో చల్లారేలా లేదు. పార్టీలో సమస్య సర్దుకుంది అనుకునేలోపే మరో సమస్య తలెత్తి చూస్తోంది. తండ్రి చేతుల్లోంచి పార్టీ పగ్గాలు లాక్కున్న అఖిలేష్ యాదవ్ కు ముందు ముందు మంచి రోజులు లేవన్న సంకేతాలు ఇస్తున్నారు అతని బాబాయ్ శివ్పాల్ యాదవ్. ఎన్నికల ముందు ఏం చేసినా అది పార్టీకి తీవ్ర నష్టాన్నే మిగులుస్తుంది. ప్రతిపక్షాలకు బాగా కలిసొచ్చేలా చేస్తుంది. అందుకే ములాయం సింగ్ సోదరుడు శివ్ పాల్ యాదవ్ సమాజ్ వాదీ పార్టీ తరుపున నామినేషన్ దాఖలు చేశారు. యూపీ ఎన్నికల ఫలితాలు మార్చి 11న వెలువడనున్నాయి. ఆ రోజున తాను కొత్త పార్టీని పెట్టనున్నట్టు ప్రకటించారు. ములాయం సింగ్ తన తమ్ముడు పెట్టే కొత్త పార్టీలో చేరుతారో లేక తన చేతుల్లోంచి బలవంతంగా కొడుకు లాక్కున్న పార్టీలో ఉంటారో తేల్చుకోవాల్సి ఉంటుంది.
శివపాల్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తాను తన అన్న ములాయంపై పదే పదే పార్టీలోని కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కొంత మంది నేతాజీ (ములాయం) వల్లే తాము పై స్థాయిలో ఉన్నామని గతంలో చెప్పుకున్నారని... ఇప్పుడు వాళ్లే నేతాజీపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అఖిలేష్ తండ్రిని బాధించేలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ములాయంకు కాంగ్రెస్ పార్టీ అంటే అస్సలు పడదు.
శివపాల్ యాదవ్ మంగళవారం మీడియాతో మాట్లాడుతూ తాను తన అన్న ములాయంపై పదే పదే పార్టీలోని కొందరు విమర్శలు చేస్తున్నారని అన్నారు. కొంత మంది నేతాజీ (ములాయం) వల్లే తాము పై స్థాయిలో ఉన్నామని గతంలో చెప్పుకున్నారని... ఇప్పుడు వాళ్లే నేతాజీపై బురద చల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
అఖిలేష్ తండ్రిని బాధించేలా ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. ములాయంకు కాంగ్రెస్ పార్టీ అంటే అస్సలు పడదు.