యాప్నగరం

ఏప్రిల్ 10: ఎన్టీయేకు శివసేన డెడ్‌లైన్

శివసేన ఎన్డీయేకు అల్టిమేటం ఇచ్చింది. ఎంపీ రవీంద్ర కుమార్ పై విధించిన విమానయాన ఆంక్షలు తొలగించకపోతే

TNN 6 Apr 2017, 5:51 pm
శివసేన ఎన్డీయేకు అల్టిమేటం ఇచ్చింది. ఎంపీ రవీంద్ర కుమార్ పై విధించిన విమానయాన ఆంక్షలు తొలగించకపోతే ఏప్రిల్ 10న ఎన్డీయే భాగస్వామ్య పక్షాలతో నిర్వహించే సమావేశాన్ని బహిష్కరిస్తామని శివసేన ఎంపీ సంజయ్ రావత్ హెచ్చరించారు. ఎన్డీయో సమావేశానికంటే ముందే ఈ వ్యవహారాన్ని తేల్చాలని ఆయన స్పష్టం చేశారు.
Samayam Telugu shivsena warns not to attend ndas meeting if gaikwad issue not resolved
ఏప్రిల్ 10: ఎన్టీయేకు శివసేన డెడ్‌లైన్


‘రేపిస్టులు, టెర్రరిస్టులు, విజయ్ మాల్యాలాంటి పన్ను ఎగవేతదారులు... చివరికి కశ్మీరి వేర్పాటు వాదులు సైతం విమానాల్లో ప్రయాణిస్తుండగా.. ఎంపీగా ఎన్నికైన రవీంద్రపై ఎందుకు ఆంక్షలు విధించారు?’ అని రావత్ ప్రశ్నించారు. ఈ వ్యవహారం వెనుక ఎవరున్నారో త్వరలో బయటపెడతామని ఆయన అన్నారు.

ఈ అంశంపై సమగ్ర విచారణ జరిపిస్తామని హోంమంత్రి రాజ్ నాథ్ సింగ్ హామీ ఇచ్చారని రావత్ తెలిపారు. రవీంద్రపై విధించిన విమాన నిషేదం గురువారం లోక్ సభను స్తంభింపజేసింది. రవీంద్రకు మద్దతుగా శివసేన ఎంపీలు సభలో నిరసనకు దిగారు. రవీంద్రపై నిషేదం ఎత్తవేయకుంటే ముంబై నుంచి ఒక్క విమానం కూడా బయటకు వెళ్లదు అని శివసేన ఎంపీ ఒకరు హెచ్చరించారు.

తన చేతిలో దాడికి గురైన ఎయిరిండియా ఉద్యోగి సుకుమార్ కు ఎట్టిపరిస్థితుల్లో క్షమాపణ చెప్పబోనని రవీంద్ర గైక్వాడ్ లోక్ సభలో స్పష్టం చేశారు.

విమానయాన మంత్రి అశోక్ గజపతిరాజు మాట్లాడుతూ విమానసంస్థల ఉద్యోగులు, ప్రయాణికుల భద్రత తమకు ప్రధానమని స్పష్టం చేశారు. రవీంద్ర చేసిన దాడిని ఆయన ఖండించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.