యాప్నగరం

చెప్పులతో సీఎంపై దాడి

ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ ఆగంతకుడు చెప్పులు విసిరాడు. ఒకటి తర్వాత ఒకటి వరసుగా రెండు చెప్పులను సెక్యూరిటీ అడ్డుకోవడంతో నవీన్ పట్నాయక్‌కు ఘోర పరాభవం తృటిలో తప్పింది.

TNN 21 Feb 2018, 1:55 pm
ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో ప్రసంగిస్తున్న ఆయనపై ఓ ఆగంతకుడు చెప్పులు విసిరాడు. కొద్దిపాటి తేడాతో సీఎం చెప్పులదాడి నుంచి తప్పించుకున్నాడు. సెక్యూరిటీ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో సీఎం నవీన్ పట్నాయక్‌కు చెప్పులు తగల లేదు. సెక్యూరిటీ గార్డు తన చేతులను అడ్డుపెట్టి చెప్పులను అడ్డుకున్నాడు. ఒకటి తర్వాత ఒకటి వరసుగా రెండు చెప్పులను సెక్యూరిటీ అడ్డుకోవడంతో నవీన్ పట్నాయక్‌కు ఘోర పరాభవం తృటిలో తప్పింది.
Samayam Telugu shoes hurled at odisha cm naveen patnaik during
చెప్పులతో సీఎంపై దాడి


ఉపఎన్నికల కోసం బైజేపూర్ నియోజకవర్గంలోని 'కుంబ్రీ' గ్రామంలో ప్రచారం చేస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. నిందితుడిని పోలీసులు అక్కడికక్కడే అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు ఈ దాడిని ఖండించాయి. ఈ సంఘటన ఒక 'బ్యాడ్ ట్రెండ్' అని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి 'దెబాషిష్ పట్నాయక్' పేర్కొనగా, ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదని బీజేపీ అధికార ప్రతినిధి అన్నారు. అయితే అధికార బీజేడీ మాత్రం నిందితుడికి బీజేపీ ప్రోద్భలం ఉండి ఉంటుందని అనుమానం వ్యక్తం చేసింది. ఓటమి తప్పదని భావించే బీజేపీ ఈ దుశ్చర్యకు పాల్పడి ఉండవచ్చని బీజేడీ ఉపాధ్యక్షుడు 'ఎస్.ఎస్.పాత్రో' అనుమానం వ్యక్తం చేశారు.

అయితే మూడు వారాల కిందట ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనేందుకు 'తాలసారి' బీచ్‌కు వచ్చిన పట్నాయక్ పై ఓ మహిళ కోడి గుడ్ల విసిరింది. అయితే అదృష్టవశాత్తు ఆ గుడ్లు సీఎంను తాకలేదు. ఈ ఉదంతం మరకముందే చెప్పుల దాడి చోటుచేసుకుంది. కోడిగుడ్లు విసిరిన మహిళను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపినప్పటికీ సీఎం నవీన్ పట్నాయక్ కేసు ఉపసంహరించుకోవడంతో ఆమె విడుదల అయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.