యాప్నగరం

సిక్కింకు మరిన్ని భారత దళాలు..

చైనా హెచ్చరికలను భారత్‌ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. సిక్కిం సరిహద్దుకు మరిన్ని భద్రతా దళాలను పంపించి దూకుడు పెంచింది..

TNN 11 Jul 2017, 7:40 pm
చైనా హెచ్చరికలను భారత్‌ ఏ మాత్రం ఖాతరు చేయలేదు. సిక్కిం సరిహద్దుకు మరిన్ని భద్రతా దళాలను పంపించి దూకుడు పెంచింది. భారత్‌, భూటాన్‌, చైనా సరిహద్దుల్లోని ట్రై జంక్షన్‌ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చైనా చేసిన హెచ్చరికలకు ఘాటుగా బదులిచ్చింది. భద్రతా చర్యల్లో భాగంగా 2500 సైనికులను అక్కడకు తరలించారు. ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు భారత్‌ సిద్ధంగా ఉందని సైనికాధికారులు తెలిపారు. సముద్ర మట్టానికి 10 వేల అడుగుల ఎత్తులో ఉన్న సరిహద్దుల్లో భారీ స్థాయిలో సైనిక దళాలను మోహరించడం ద్వారా డోక్లామ్‌ నుంచి వెనుదిరిగేందుకు సిద్ధంగా లేదని చైనాకు భారత్‌ విస్పష్టంగా చెప్పినట్లైంది. కీలకమైన నాథులా మార్గంలోనూ భారత్‌ నిఘాను పెంచింది.
Samayam Telugu sikkim border dispute indian army deploys 2500 more soldiers to doklam
సిక్కింకు మరిన్ని భారత దళాలు..


గత కొద్ది వారాలుగా డొక్లామ్‌ ప్రాంతంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. భూటాన్‌కు చెందిన డొక్లామ్‌లో చైనా సైన్యం రహదారి నిర్మించడానికి చేసిన ప్రయత్నాలను భారత దళాలు అడ్డుకోవడాన్ని ఆ దేశం తట్టుకోలేకపోతోంది. నాటి నుంచి కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. మరోవైపు భారత్‌పై బెదిరింపులకు పాల్పడుతూ చైనా మీడియా కుట్రపూరిత వార్తలను వండివారుస్తోంది.

కశ్మీర్‌ అంశంలో మూడో దేశం జోక్యాన్ని కొట్టిపారేయలేమని చైనా అధికార పార్టీకి చెందిన పత్రిక గ్లోబల్‌ టైమ్స్‌ తాజాగా మరో వివాదాస్పద కథనాన్ని ప్రచురించింది. కశ్మీర్‌ అంశంలో పాక్‌ అభ్యర్థిస్తే మూడో దేశం ప్రవేశించే అవకాశం ఉన్నట్లు అందులో రాసుకొచ్చారు. డొక్లామ్‌ అంశంలో భారత్‌ అనుసరిస్తున్న విధానాన్నే తాము కశ్మీర్‌ అంశంలో ప్రయోగిస్తామని హెచ్చరించారు. భూటాన్‌ పేరుతో భారత దళాలు డొక్లామ్‌లోకి చొచ్చుకు వస్తున్నాయని ఆరోపించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.