యాప్నగరం

ఆ యువ ఐఏఎస్ మరణానికి కారణాలేంటీ?

యువ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ లక్నోలోని రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్నారు.

TNN 21 May 2017, 12:19 pm
యువ ఐఏఎస్ అధికారి అనురాగ్ తివారీ లక్నోలోని రోడ్డుపై విగతజీవిగా పడి ఉన్నారు. దారిన పోయే వాళ్లు చూసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు వచ్చి ఐడీ కార్డు ద్వారా అతనో ఐఏఎస్ అని తేల్చడంతో సంచలనమైంది. అతను ఆత్మహత్య చేసుకున్నాడో, లేక ఎవరైనా చంపేశారో తెలియకపోవడంతో అనుమానాస్పద మృతి కేసుగా నమోదు చేసుకున్నారు పోలీసులు. ప్రభుత్వం ఆ అధికారి కేసు త్వరగా తేల్చమంటూ సిట్ (ప్రత్యేక దర్యాప్తు బృందం) ఏర్పాటు చేసింది. అనురాగ్ తివారీ కర్ణాటక కేడర్ కు చెందిన ఐఏఎస్. బెంగూళురులో ఫుడ్ కార్పొరేషన్లో పనిచేస్తున్నారు. కనుక ఇక్కడికి వచ్చి సిట్ దర్యాప్తు చేయనుంది.
Samayam Telugu sit probing ias anurag tiwaris death case
ఆ యువ ఐఏఎస్ మరణానికి కారణాలేంటీ?


అనురాగ్ తివారీ కుటుంబం కర్ణాటకకు చెందిన కొంతమంది అధికారులు, మంత్రులపై అనుమానం వ్యక్తం చేస్తోంది. తివారీ తమ్ముడు మయాంక్ తన అన్న రెండు వేల కోట్ల రూపాయల కుంభకోణానికి సంబంధించిన వివరాలు, ఆధారాలు సేకరించారని చెప్పాడు. వాటిని మోడీకి, సీబీఐకి పంపించాలని అనుకున్నారని... దీంతో కొందరు మంత్రులు అధికారుల ద్వారా ఒత్తిడి తెచ్చారని వివరించారు. అన్న అనురాగ్ తనకి అన్ని విషయాలు చెప్పి... ఆ ఆధారాలను కూడా పంపించారని చెప్పాడు. కుంభకోణం బయటపెడతారన్న భయంతో ఎవరైనా చంపించి ఉండొచ్చని వారు అనుమానం పడుతున్నారు.

సిట్ కుటుంబ కలహాల కోణం నుంచి కూడా దర్యాప్తు చేస్తోంది. అనురాగ్ వ్యక్తిగత జీవితంలో వచ్చిన ఒడిదొడుకుల వల్ల కూడా కుంగిపోయినట్టు భావిస్తున్నారు. భార్యతో విడాకులు తీసుకున్నాక మరింత కుంగిపోయారని కొందరు చెబుతున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.