బీహార్లో సంచలనం సృష్టించిన శివాన్ జర్నలిస్ట్ హత్య కేసులో లాలూ తనయుడు తేజ్ ప్రతాప్కు సుప్రీం కోర్టు నోటీసులు జారీచేసింది. తేజ్ ప్రతాప్తో పాటు ఇటీవల జైలు నుంచి విడుదలైన ఆర్జేడీ మాజీ నేత షాబుద్దీన్కు కూడా నోటీసులు ఇచ్చింది. బీహార్లో రాజకీయ నేరాలపై ఆందోళన వ్యక్తం చేసిన సర్వోన్నత న్యాయస్థానం శివాన్ జర్నలిస్ట్ రాజేంద్ర రంజన్ హత్య కేసుపై నితీష్ సర్కార్ స్పందన కోరింది. రాజేంద్ర రంజన్ భార్య బీహార్లో న్యాయ విచారణ సక్రమంగా జరగదని కేసును డిల్లీకి బదిలీ చేయాలని కోరారు. ఈ పిటీషన్ను అపెక్స్ కోర్టు విచారణకు స్వీకరించింది. బీహార్ ప్రభుత్వంలో ఆరోగ్య మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న లాలూ ప్రసాద్ యాదవ్ పెద్ద కొడుకు తేజ్ ప్రతాప్ యాదవ్కు కోర్టు నోటీసులు ఇచ్చింది. షార్ప్షూటర్గా పేరుగాంచిన షాబుద్దీన్ కూడా ఈ హత్య కేసులో నిందితుడిగా పేర్కొంది. బీహార్లో సంచలనం సృష్టించిన రాజీవ్ రంజన్ మర్డర్ కేసులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఆందోళన చేపట్టాయి.
ఈ కేసులో ప్రధాన నిందుతుడైన మహ్మద్ కైఫ్ అలియాస్ బంటీతో తేజ్ ప్రతాప్ దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. పదకొండేళ్ల శిక్ష తర్వాత భాగల్పూర్ జైలు నుంచి ఇటీవల షాబుద్దీన్ విడుదలైనప్పుడు ఆయనతో కలిసి కైఫ్ దిగిన ఫోటోలు మీడియాలో కనిపించాయి. తేజ్ ప్రతాప్ యాదవ్తో కైఫ్ దిగిన ఫోటోల గురించి శివాన్ ఎస్పీ సౌరభ్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. షాబుద్దీన్తో కలిసి నిందితుడు అనేక ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో పాల్గొన్నాడని తెలియజేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి అక్టోబరు 17 లోపు నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. అలాగే రాజీవ్ రంజన్ భార్యకు కూడా భద్రత కల్పించాలని, షాబుద్దీన్తో పాటు ఇతర నిందుతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులని కోర్టు ఆదేశించింది.
The Supreme Court on Friday expressed concern over alleged politician-criminal nexus in Bihar and sought response from Nitish Kumar government in the Siwan journalist Rajdeo Ranjan murder case.The apex court was hearing a plea of slain scribe's wife's to transfer the case to Delhi, citing the fact that she will not get a fair trial in Bihar.The court issued notice to Lalu Prasad's elder son Tej Pratap who is the health minister of Bihar for allegedly protecting people who killed the journalist in Siwan.
ఈ కేసులో ప్రధాన నిందుతుడైన మహ్మద్ కైఫ్ అలియాస్ బంటీతో తేజ్ ప్రతాప్ దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేశాయి. పదకొండేళ్ల శిక్ష తర్వాత భాగల్పూర్ జైలు నుంచి ఇటీవల షాబుద్దీన్ విడుదలైనప్పుడు ఆయనతో కలిసి కైఫ్ దిగిన ఫోటోలు మీడియాలో కనిపించాయి. తేజ్ ప్రతాప్ యాదవ్తో కైఫ్ దిగిన ఫోటోల గురించి శివాన్ ఎస్పీ సౌరభ్ షా టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడారు. షాబుద్దీన్తో కలిసి నిందితుడు అనేక ప్రాంతాల్లో జరిగిన దాడుల్లో పాల్గొన్నాడని తెలియజేశారు. ఈ కేసులో సీబీఐ దర్యాప్తును పర్యవేక్షించడానికి అక్టోబరు 17 లోపు నివేదిక అందజేయాలని సుప్రీంకోర్టు ఆదేశించిందని ఆయన తెలిపారు. అలాగే రాజీవ్ రంజన్ భార్యకు కూడా భద్రత కల్పించాలని, షాబుద్దీన్తో పాటు ఇతర నిందుతులపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులని కోర్టు ఆదేశించింది.
The Supreme Court on Friday expressed concern over alleged politician-criminal nexus in Bihar and sought response from Nitish Kumar government in the Siwan journalist Rajdeo Ranjan murder case.The apex court was hearing a plea of slain scribe's wife's to transfer the case to Delhi, citing the fact that she will not get a fair trial in Bihar.The court issued notice to Lalu Prasad's elder son Tej Pratap who is the health minister of Bihar for allegedly protecting people who killed the journalist in Siwan.