దివంగత నాయకురాలు జయలలిత అంత్యక్రియలు సాయంత్రం నాలుగున్నరకు జరుగుతాయి. మెరీనా బీచ్లోని ఎంజీఆర్ ఘాట్ పక్కనే ఆమె అంత్యక్రియలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన సీఎంలు, కేంద్రమంత్రులు హాజరుకానున్నారు. ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, ఒడిశా, కర్ణాటక, కేరళ, ఢిల్లీ ముఖ్యమంత్రులతో పాటూ సింగపూర్ మంత్రి బాలకృష్ణన్ కూడా హాజరుకానున్నారు.
ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే చెన్నై బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, హరీష్ రావు హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను రాలేక పోతున్నానని, తన తరుపున ఇద్దరు ఎంపీలను పంపిస్తున్నట్టు ట్వీటు ద్వారా పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్, కళ్యాణ్ బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ లిద్దరూ అంత్యక్రియలకు హాజరవుతారు.
Was very eager to be present but flight availability/timings from Kolkata not making it possible 2/3 — Mamata Banerjee (@MamataOfficial) December 6, 2016 Sending our 2 MPs, Derek and Kalyan from Delhi on my behalf. #RIP 3/3 — Mamata Banerjee (@MamataOfficial) December 6, 2016
ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పటికే చెన్నై బయలుదేరి వెళ్లారు. తెలంగాణ రాష్ట్రం నుంచి మంత్రులు నాయిని నర్సింహా రెడ్డి, హరీష్ రావు హాజరుకానున్నారు. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను రాలేక పోతున్నానని, తన తరుపున ఇద్దరు ఎంపీలను పంపిస్తున్నట్టు ట్వీటు ద్వారా పేర్కొన్నారు. ఢిల్లీ నుంచి తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు డెరెక్, కళ్యాణ్ బయలుదేరారు. కాంగ్రెస్ పార్టీ నుంచి రాహుల్ గాంధీ, గులాం నబీ ఆజాద్ లిద్దరూ అంత్యక్రియలకు హాజరవుతారు.
Was very eager to be present but flight availability/timings from Kolkata not making it possible 2/3 — Mamata Banerjee (@MamataOfficial) December 6, 2016 Sending our 2 MPs, Derek and Kalyan from Delhi on my behalf. #RIP 3/3 — Mamata Banerjee (@MamataOfficial) December 6, 2016