యాప్నగరం

స్పీకర్‌పై కాగితాలు విసిరివేత, సస్పెన్షన్

లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై కాగితాలు విసిరేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలపై ఐదు రోజులపాటు సస్పెన్షన్ వేటు పడింది.

Samayam Telugu 24 Jul 2017, 3:07 pm
లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌పై కాగితాలు విసిరేసిన ఆరుగురు కాంగ్రెస్ ఎంపీలపై ఐదు రోజులపాటు సస్పెన్షన్ వేటు పడింది. గోరక్షణ పేరుతో జరుగుతున్న దాడులు, హత్యలపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఈ దాడులపై చర్చించాలని లోక్ సభలో సోమవారం ప్రతిపక్ష సభ్యులు పట్టుబట్టారు. అటు అధికార బీజేపీ సభ్యులు భోఫోర్స్ అంశాన్ని లేవనెత్తుతూ నినాదాలు చేశారు.
Samayam Telugu six congress mps suspended from ls for five days for throwing papers
స్పీకర్‌పై కాగితాలు విసిరివేత, సస్పెన్షన్


స్పీకర్ చర్చకు అనుమతించకపోవడంతో కాంగ్రెస్ సభ్యులు అదిర్ రంజన్ చౌదరి, రంజిత్ రంజన్, సుష్మిత దేబ్, గౌరవ్ గోగొయ్, కె.సురేష్ లు స్పీకర్ చైర్ పై కాగితాలు విసిరేసి నినాదాలు చేశారు. దీంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ సదరు ఎంపీలపై ఐదు రోజుల పాటు సభ నుంచి సస్పెండ్ చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.