యాప్నగరం

సెప్టిక్‌ ట్యాంకులో విషవాయువులు.. ఒకరిని కాపాడాలని మరొకరు ఆరుగురి మృతి

సెప్టిక్ ట్యాంకులోకి ఒకరి తర్వాత మరొకరు దిగి ఆరుగురు మృతి చెందారు. జార్ఖండ్‌లోని దియోగఢ్‌లో ఈ విషాదం చోటు చేసుకుంది.

Samayam Telugu 9 Aug 2020, 6:35 pm
సెప్టిక్‌ ట్యాంకు నుంచి విషవాయులులు లీకై ఆరుగురు మృతి చెందిన విషాద ఘటన జార్ఖండ్ రాష్ట్రంలో చోటు చేసుకుంది. జార్ఖండ్‌‌లోని దియోగఢ్‌లోని దేవీపూర్‌లో ఓ వ్యక్తి సెప్టిక్‌ ట్యాంకు శుభ్రం చేయించడానికి ఇద్దరు కూలీలను తీసుకొచ్చాడు. వాళ్లు ట్యాంకులోకి దిగగానే ఊపిరాడక మరణించారు. ట్యాంక్ నుంచి కూలీలు ఎంతసేపటికీ బయటకి రాకపోవడంతో అనుమానం వచ్చిన యజమాని అక్కడికి వెళ్లి చూడగా కూలీలు పడిపోయి ఉన్నారు. దీంతో ఇంటి యజమాని ఇద్దరు కుమారులు వెంటనే ట్యాంక్‌లోకి దిగారు. వారు కూడా తిరిగి రాకపోయేసరికి ఆ యజమాని పొరుగింటి వారిని పిలిచాడు.
Samayam Telugu జార్ఖండ్ సెప్టిక్ ట్యాంక్ విషాదం
6 death in septic tank in Jharkhand


పొరుగింటికి చెందిన ఇద్దరు వ్యక్తులు కూడా సెప్టిక్‌ ట్యాంక్‌లోకి దిగి తిరిగి రాలేదు. విషయం తెలుసుకున్న స్థానికులు సెప్టిక్ ట్యాంక్‌ను పగులగొట్టి వారందరినీ బయటకు తీసుకొచ్చారు. కానీ, అప్పటికే వారంతా మృత్యువాతపడ్డారు. ఒకరిని కాపాడేందుకు మరొకరు ఒక్కొక్కరుగా సెప్టిక్ ట్యాంక్‌లోకి దిగి ఆరుగురు మరణించారు. ఈ ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.

Also Read: మద్యం మత్తులో నిజం చెప్పిన అల్లుడు.. తల నరికేసిన మామ

Must Read: కేరళ: ఆ రన్ వే ప్రమాదకరం.. 2011లోనే నివేదిక

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.