యాప్నగరం

యూపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు రైతులు దుర్మరణం

తాము పండించిన పంటను మార్కెట్‌లో అమ్ముకోడానికి వాహనంలో బయలుదేరిన రైతులను మృత్యువు వెంబడించింది. వారు ప్రయాణిస్తున్న వాహానాన్ని మరో వాహనం ఢీకొట్టింది. ఈ ఘటన యూపీలో చోటుచేసకుంది.

Samayam Telugu 20 May 2020, 9:33 am
ఉత్తరప్రదేశ్‌లో బుధవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఎటవా సమీపంలో జరిగిన ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు దుర్మరణం చెందారు. రైతులు పండ్లను విక్రయించడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పండ్లను విక్రయించడానికి రైతులు ట్రక్కులో వస్తుండగా.. ఎటవా ఫ్రెండ్స్ కాలనీ సమీపంలో ఎదురెదుగా వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు రైతులు మృతిచెందగా.. మరొకరు గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత ఈ ప్రమాదం జరిగినట్టు ఎటవా జిల్లా ఎస్పీ ఆర్ సింగ్ తెలిపారు. తమ తోటలో పండిన పనస పండ్లను అమ్మడానికి రైతులు వెళ్తుండగా దుర్ఘటన జరిగిందన్నారు.
Samayam Telugu ఉత్తరప్రదేశ్ రోడ్డు ప్రమాదం


గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం సఫాయి మెడికల్ కాలేజీ హాస్పిటల్‌లో చేర్పించినట్టు తెలిపారు. ప్రమాదం గురించి సమచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. ఎదురెదురుగా వాహనాలు ఢీకొట్టడంతో ఒకదానికి ఒకటి అతుక్కుపోయి.. అందులో మృతదేహాలు చిక్కుకున్నాయి. అతికష్టంతో మృతదేహాలను బయటకు తీశారు. క్రేన్ సాయంతో వాహనాలను వేరుచేసి, అందులోని వారిని బయటకు తీసినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రుని వైద్యం కోసం తరలించామని, అతడి పరిస్థితి నిలకడగా ఉందని పోలీసుల వెల్లడించారు.

కాగా, ఈ ప్రమాదంపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ.2 లక్షలు, గాయపడిన వారికి రూ.50,000 చొప్పున ఎక్స్‌గ్రేషియో ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందజేయాలని సూచించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.