యాప్నగరం

క్వారీలో పేలుడు.. ఆరుగురి దుర్మరణం

Chikkaballapur: కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్వారీలో పేలుడు సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. ఘటన పట్ల ప్రధాని మోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

Samayam Telugu 23 Feb 2021, 3:02 pm
క్వారీలో పేలుడు సంభవించి ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. కర్ణాటకలోని చిక్‌బళ్లాపూర్‌ జిల్లాలోని హీరానాగవేలిలో ఈ ఘటన చోటుచేసుకుంది. రాళ్ల క్వారీలో అమర్చిన జిలెటిన్‌ స్టిక్స్‌ తొలగిస్తుండగా పేలుడు సంభవించింది. దీంతో ఆరుగురు కార్మికులు అక్కడికక్కడే మరణించారు. ఈ ప్రమాదంలో మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం పట్ల ప్రధాని నరేంద్ర మోదీ, కర్ణాటక ముఖ్యమంత్రి బీఎస్ యడియూరప్ప సహా పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Quarry Blast


హీరానాగవేలిలోని రాళ్ల క్వారీలో అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేశారని అధికారులు చెబుతున్నారు. కాంట్రాక్టర్, మైనింగ్ యజమానిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సదరు క్వారీలో కొన్ని రోజుల కిందట జిలెటిన్‌ స్టిక్స్‌ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ఇప్పుడు వాటిని ఉపయోగించేందుకు అనుమతి లేదని కాంట్రాక్టర్‌ తన సిబ్బందికి సూచించాడు. ఈ క్రమంలో సిబ్బంది ఆ జిలెటిన్‌ స్టిక్స్‌ను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నించగా ఈ ఘోర విషాదం సంభవించింది.

పేలుడులో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనా స్థలాన్ని రాష్ట్ర ఆరోగ్య మంత్రి కే సుధాకర్‌ సందర్శించారు. అక్రమంగా పేలుడు పదార్థాలు నిల్వ చేసిన మైనింగ్‌ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.