మావోయిస్టులకు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల మహారాష్ట్రలోని గడ్చిరోలి ప్రాంతంలో జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 40 మంది నక్సల్స్ హతమైన విషయం తెలిసిందే. తాజాగా ఒడిశాలోని రెండు జిల్లాల్లో జరిగిన ఎన్కౌంటర్లలో ఆరుగురు మృతి చెందారు. ఆదివారం నాడు బొలంగిర్ జిల్లాలో ఇద్దరు, కొంధమాల్ జిల్లాలో నలుగురు మావోలు హతమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బేల్పడా సమితి డుడుకామల అటవీ ప్రాంతంలో సుమారు 15 మంది మావోయిస్టులున్నట్టు సమాచారం అందడంతో కూబింగ్ నిర్వహించారు. ఒడిశా పోలీసులు, సీఆర్పీఎఫ్ దళాలు ఈ కూబింగ్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా భద్రతా దళాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్ మృతి చెందగా, మిగతావారు తప్పించుకున్నారు. మృతుల్లో మావో అగ్రనేత సంజీవ్ కూడా ఉన్నట్టు సమాచారం.
అలాగే కజురుపొడ తాలూకా పరిధిలోని సుడ్రకుంప-గొలంకి అటవీ ప్రాంతంలో 13 మంది మావోలు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఓజీ, డీవీఎఫ్ల సంయుక్త బలగాలు ఆదివారం మధ్యాహ్నం కూబింగ్ చేపట్టారు. ఈ సమయంలో నక్సల్స్ ఎదురుపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు.. ఈ ఘటనలో నలుగురు హతమవగా, మిగిలినవాళ్లు తప్పించుకున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ సైతం ఉన్నారు. ఘటనాస్థలంలో మావోల నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఏకే 47 రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.
అలాగే కజురుపొడ తాలూకా పరిధిలోని సుడ్రకుంప-గొలంకి అటవీ ప్రాంతంలో 13 మంది మావోలు సమావేశమైనట్టు సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఓజీ, డీవీఎఫ్ల సంయుక్త బలగాలు ఆదివారం మధ్యాహ్నం కూబింగ్ చేపట్టారు. ఈ సమయంలో నక్సల్స్ ఎదురుపడటంతో పోలీసులు కాల్పులు జరిపారు.. ఈ ఘటనలో నలుగురు హతమవగా, మిగిలినవాళ్లు తప్పించుకున్నారు. మృతుల్లో ఇద్దరు మహిళా నక్సల్స్ సైతం ఉన్నారు. ఘటనాస్థలంలో మావోల నుంచి భారీ మొత్తంలో పేలుడు పదార్థాలు, ఏకే 47 రైఫిల్స్, ఇతర ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు.