యాప్నగరం

Oxygen సంక్షోభం.. ఊపిరాడక ఆరుగురు మృతి

ఆక్సిజన్ అందక ఉక్కిరిబిక్కిరై రోగులు ప్రాణాలు కోల్పోతున్న అత్యంత విషాదకర పరిస్థితులు నెలకొన్నాయి. ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఆక్సిజన్ అందని కారణంగా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు.

Samayam Telugu 24 Apr 2021, 6:49 pm
దేశంలో కరోనా విలయతాండవం ఆక్సిజన్ సంక్షోభానికి దారితీసింది. ఆక్సిజన్ అందక మృతి చెందుతున్న కరోనా రోగుల సంఖ్య పెరుగుతోంది. రెండు రోజుల కిందట నాసిక్‌లో ఆక్సిజన్ సరఫరాకు అంతరాయం కలగడంతో 22 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశరాజధాని ఢిల్లీలో ఆక్సిజన్ అందని కారణంగా 20 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా అలాంటి దారుణ ఘటన మరోటి వెలుగుచూసింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
oxygen


పంజాబ్‌లోని అమృత్‌సర్‌లోని నీల్‌కాంత్ ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. అందులో ఐదుగురు కరోనా రోగులు ఉన్నట్లు వైద్యులు తెలిపారు. రోగులు ప్రాణాలు కోల్పోయాక కేవలం ఐదు ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశారని ఆస్పత్రి చైర్మన్, ఎండీ సునీల్ దేవగణ్ తెలిపారు. ప్రభుత్వ ఆస్పత్రులకు తొలి ప్రాధాన్యం ఇవ్వడంతో తమకు సరైన సమయంలో ఆక్సిజన్ సప్లై చేయలేకపోతున్నామని సప్లయర్లు చెబుతున్నారని ఆయన అన్నారు. అయితే ఈ ఘటనపై పంజాబ్ ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.