యాప్నగరం

Maharashtra: ఘోర ప్రమాదం... పెళ్లి వేడుకకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన కుటుంబం

మహారాష్ట్రలోని (Maharashtra) హైవేలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు వాహనాల ఢీకొన్న ఘటనలో ఆరుగురు చనిపోయారు. ఆదివారం తెల్లవారుజామున ఈ సంఘటన చోటుచేసుకుంది. అయితే వారంతా వివాహ వేడుకకు వెళ్తున్నట్టు తెలుస్తుంది.

Authored byAndaluri Veni | Samayam Telugu 14 Aug 2022, 8:57 pm

ప్రధానాంశాలు:

  • మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం
  • రహదారిపై ఢీకొన్న కారు, టెంపో
  • సహాయక చర్యలు చేపడుతున్న పోలీసులు
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Accident in Beed
మహారాష్ట్రలోని (Maharashtra) బీడ్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మంజార్ సంబా, పటోడా హైవేపై రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఉదయం 5.30 గంటల సమమంలో కారు, మరో వాహనం ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే చనిపోయారు.
ప్రమాదం తీవ్రస్థాయిలో జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాద ధాటికి కారు మొత్తం నుజ్జునుజ్జు అయిపోయింది. స్థానికులు అందించిన సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అక్కడ పరిసరాలను పరిశీలించారు. సమాచారం అందుకున్న సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదంలో చనిపోయిన ఐదుగురు ఒకే కుటుంబానికి చెందినవారిగా పోలీసులు గుర్తించారు.

అయితే వారంతా ఓ వివాహ వేడుకకు వెళ్తున్న సందర్భంలో వారిని మృత్యువు కబలించినట్టు తెలుస్తుంది. కుటుంబానికి చెందిన ఐదుగురు కారులో పూణెలో జరుగుతున్న పెళ్లిక వెళ్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రమాదవశాత్తు వారి కారు ఓ టెంపోను ఢీకొట్టిందని పోలీసులు వెల్లడించారు. కాగా పోలీసులు రెండు వాహనాలను క్రేన్‌ సాయంతో వేరు చేసి.. తరలించినట్టు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

Read Also: దేశం కోసం ఉరికంబాన్ని అదృష్టంగా భావించిన అష్ఫాఖుల్లా ఖాన్
Read Also:పోటెత్తిన వరదలు.. వీధిలోకి వచ్చిన మొసలి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.