యాప్నగరం

​జయ బంగ్లా వద్ద బయటపడ్డ అస్తిపంజరం!

జయలలిత మరణానంతరం అక్కడ అనుమానాస్పద సంఘటనలు చోటు చేసుకొంటూనే ఉన్నాయి

TNN 28 Jun 2017, 3:12 pm
జయలలిత మరణానంతరం సిరుతాపూర్ బంగ్లా వద్ద అనుమానాస్పద సంఘటనలు చోటు చేసుకొంటూనే ఉన్నాయి. రెండు నెలల కిందట ఈ బంగ్లా వద్ద పెద్ద అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ సమయంలో జయలలిత ఆస్తులకు సంబంధించిన పత్రాలు దగ్ధం అయినట్టుగా వార్తలు వచ్చాయి. అంతకన్నా మునుపు ఈ బంగ్లా సెక్యూరిటీ గార్డు ఒకరు హత్యకు గురయ్యారు. ఈ నేపథ్యంలో తాజాగా బంగ్లా ఆవరణలో ఒక అస్తిపంజరం బయటపడటం సంచలనంగా మారింది. ఇది ఎవరిది? అసలేం జరిగిందనేది మిస్టరీగా నిలుస్తోంది.
Samayam Telugu skeleton sound in jaya bungalow
​జయ బంగ్లా వద్ద బయటపడ్డ అస్తిపంజరం!


ఈ బంగ్లా జయలలితదే అయినా చాలా కాలంగా ఇది దినకరన్ కుటుంబీకుల ఆధీనంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. అప్పుడప్పుడు మాత్రం జయలలిత సిరుతాపూర్ బంగ్లా వద్దకు వచ్చే వారు. ఇక జయలలిత మరణానంతరం ఈ బంగ్లాను దినకరన్ కుటుంబీకులు ఆక్రమించుకున్నారు. శశికళ జైలు పాలయ్యాకా, దినకరన్ అన్నాడీఎంకే నుంచి సస్పెండ్ అయిన తరుణంలో ఈ బంగ్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఆ ప్రమాదంలో జయ ఆస్తులకు సంబంధించిన కీలకమైన డాక్యుమెంట్లు కాలిపోయాయనే ప్రచారం జరిగింది.

ఇప్పుడు బంగ్లా వద్ద అస్తిపంజరం వెలుగు చేసింది. మరి అది ఎవరినైనా హత్య చేసి పాతిపెట్టినదా లేక ఖననం చేసిన శవం అస్తిపంజరం ఏదైనా తేలిందా? అనే అంశంపై పోలీసుల పరిశోధన జరుగుతోంది. ఒకవేళ హత్యే అయితే అది జయలలిత ఆస్తుల వ్యవహారంతో ముడిపడిన వ్యవహారమే అయ్యుండొచ్చు అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.