జీవితాన్ని స్వేచ్ఛగా గడపాలనే ఆలోచనతో వివాహాన్ని భారంగా భావిస్తున్న ప్రస్తుత తరాలు యూజ్ అండ్ త్రో కల్చర్కు (Use and Through Culture) అలవాటుపడుతున్నాయని కేరళ హైకోర్టు (Kerala High Court) మండిపడింది. సమాజంలో పెరుగుతున్న సహజీవన (Live in Relationship) సంస్కృతి ఆందోళనకలిగిస్తోందని ఈ మేరకు విడాకుల (Divorce) కోసం దరఖాస్తు చేసుకున్న ఓ వ్యక్తి పిటిషన్ను తిరస్కరించింది. భార్య పెట్టే చిత్రహింసలను తట్టుకోలేకపోతున్నానని ఆరోపిస్తూ విడాకుల కోసం భర్త దాఖలు చేసిన పిటిషన్ను జస్టిస్ ఏ ముహమూద్ ముస్తాఖీ, జస్టిస్ సోఫీ థామస్ల ద్విసభ్య ధర్మాసనం గతవారం తోసిపుచ్చింది.
‘‘ఈ రోజుల్లో ఎలాంటి బాధ్యతలు, బాధలు లేకుండా స్వేచ్ఛా జీవితాన్ని ఆస్వాదించడానికి వివాహమనేది భారంగా యువ తరాలు భావిస్తున్నాయి.. 'WIFE' అంటే ‘వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవర్’ (Wise Investment for Ever) అనే పాత భావనకు ‘వర్రీ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్’ (Worry Invited for Ever) అనే కొత్త అర్ధాన్ని ఇస్తున్నాయి’’ అని ఆగస్టు 24న వెలువరించి తమ తీర్పులో న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భార్య తనపట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ను కుటుంబ న్యాయస్థానం తిరస్కరించడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు.
విడాకుల చట్టం 1869 క్రైస్తవ వివాహాలకు వర్తిస్తుందని, భార్య వల్ల అతడు వేధింపులకు గురయినట్టు నిరూపించుకోలేదని కోర్టు పేర్కొంది. 2017 నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్త (51)ను క్షమించడానికి భార్య (38) సిద్ధంగా ఉన్నందున సామరస్యపూర్వకంగా తిరిగి కలిసి జీవించే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతూ విడాకులు మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది. అలప్పూజకు చెందిన దంపతులు పదేళ్ల కిందటే సౌదీకి వెళ్లి స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు అమ్మాయిలు ఉన్నాయి. ఈ కేసులో సదరు వ్యక్తి తల్లి తన కోడలికి మద్దతుగా నిలవడం చెప్పుకోదగ్గ అంశం. భార్యాపిల్లలతోనే కొడుకు కలిసుండాలని తాను కోరుకుంటున్నట్టు ఆమె కోర్టుకు వివరించింది. ‘కలతలతో నాశనమైన కుటుంబాల నుంచి వచ్చే ఆర్తనాదాలు, కేకలు మొత్తం సమాజం అంతరాత్మను కదిలించగలవు’ అని హైకోర్టు పేర్కొంది.
‘‘గొడవపడే జంటలు, ఆదరణలేని పిల్లలు, విడాకులు తీసుకున్నవారు జనాభాలో మెజారిటీ స్థానాన్ని ఆక్రమించినప్పుడు అది మన సామాజిక జీవితంలోని ప్రశాంతతపై ప్రతికూల ప్రభావం చూపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.. దీని వల్ల మన సమాజం వృద్ధి కుంటుపడుతుంది’’ అని జస్టిస్ సోఫియా థామస్ అన్నారు.
"దేవభూమిగా పిలిచే కేరళ.. ఒకప్పుడు కుటుంబ బాంధవ్యాలకు ప్రసిద్ధి చెందింది. కానీ ప్రస్తుత ట్రెండ్, స్వార్థపూరిత కారణాల వల్ల లేదా వివాహేతర సంబంధాల కోసం పిల్లలను కూడా పట్టించుకోకుండా వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.. ఇంకా ముందుకు వెళితే ‘‘యూజ్ అండ్ త్రో సంస్కృతి మన వివాహ సంబంధాలను కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.. విడిపోయినప్పుడు వీడ్కోలు చెప్పుకునే లివ్-ఇన్-రిలేషన్షిప్లు పెరుగుతున్నాయి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
‘‘ఈ రోజుల్లో ఎలాంటి బాధ్యతలు, బాధలు లేకుండా స్వేచ్ఛా జీవితాన్ని ఆస్వాదించడానికి వివాహమనేది భారంగా యువ తరాలు భావిస్తున్నాయి.. 'WIFE' అంటే ‘వైజ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎవర్’ (Wise Investment for Ever) అనే పాత భావనకు ‘వర్రీ ఇన్వైటెడ్ ఫర్ ఎవర్’ (Worry Invited for Ever) అనే కొత్త అర్ధాన్ని ఇస్తున్నాయి’’ అని ఆగస్టు 24న వెలువరించి తమ తీర్పులో న్యాయమూర్తులు వ్యాఖ్యానించారు. భార్య తనపట్ల క్రూరంగా వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ విడాకుల కోసం దాఖలు చేసిన పిటిషన్ను కుటుంబ న్యాయస్థానం తిరస్కరించడంతో అతడు హైకోర్టును ఆశ్రయించాడు.
విడాకుల చట్టం 1869 క్రైస్తవ వివాహాలకు వర్తిస్తుందని, భార్య వల్ల అతడు వేధింపులకు గురయినట్టు నిరూపించుకోలేదని కోర్టు పేర్కొంది. 2017 నుంచి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న భర్త (51)ను క్షమించడానికి భార్య (38) సిద్ధంగా ఉన్నందున సామరస్యపూర్వకంగా తిరిగి కలిసి జీవించే అవకాశం ఉంది అని అభిప్రాయపడుతూ విడాకులు మంజూరు చేయలేమని తేల్చిచెప్పింది.
‘‘గొడవపడే జంటలు, ఆదరణలేని పిల్లలు, విడాకులు తీసుకున్నవారు జనాభాలో మెజారిటీ స్థానాన్ని ఆక్రమించినప్పుడు అది మన సామాజిక జీవితంలోని ప్రశాంతతపై ప్రతికూల ప్రభావం చూపుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు.. దీని వల్ల మన సమాజం వృద్ధి కుంటుపడుతుంది’’ అని జస్టిస్ సోఫియా థామస్ అన్నారు.
"దేవభూమిగా పిలిచే కేరళ.. ఒకప్పుడు కుటుంబ బాంధవ్యాలకు ప్రసిద్ధి చెందింది. కానీ ప్రస్తుత ట్రెండ్, స్వార్థపూరిత కారణాల వల్ల లేదా వివాహేతర సంబంధాల కోసం పిల్లలను కూడా పట్టించుకోకుండా వివాహ బంధాన్ని విచ్ఛిన్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది.. ఇంకా ముందుకు వెళితే ‘‘యూజ్ అండ్ త్రో సంస్కృతి మన వివాహ సంబంధాలను కూడా ప్రభావితం చేసినట్లు కనిపిస్తోంది.. విడిపోయినప్పుడు వీడ్కోలు చెప్పుకునే లివ్-ఇన్-రిలేషన్షిప్లు పెరుగుతున్నాయి’’ అని తీవ్ర వ్యాఖ్యలు చేసింది.