యాప్నగరం

Air India కలకత్తా దుబాయ్ విమానంలో పాము కలకలం.. విషయం తెలిసి హడలిపోయిన ప్రయాణికులు

Air India ఓ విమానంలో పాము కలకలం రేపింది. దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన జరిగింది. అయితే, విమానం ల్యాండ్ అయ్యాక ప్రయాణికులు దిగిపోగా.. లగేజీలను దింపడానికి సిద్ధపడిన సమయంలో పాము కనిపించడంతో సిబ్బంది ఉలిక్కిపడ్డారు. ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం కార్గో హోల్డ్‌లో సిబ్బంది పామును గుర్తించారు. ఈ విమానం కలకత్తా నుంచి కేరళలోని కాలికట్ మీదుగా దుబాయ్ ఎయిర్‌పోర్ట్‌కు శనివారం చేరింది. ఈ సమయంలో ఘటన జరిగినట్టు డీజీసీఏ అధికారులు వెల్లడించారు.

Authored byఅప్పారావు జివిఎన్ | Samayam Telugu 11 Dec 2022, 7:42 am

ప్రధానాంశాలు:

  • కలకత్తా నుంచి కేరళ మీదుగా వెళ్లిన విమానం
  • దుబాయ్‌లో ల్యాండ్ అయిన తర్వాత ఘటన
  • విచారణకు ఆదేశించినట్టు ప్రకటించిన డీజీసీఏ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu AirIndia Flight
Air India కోల్‌కతా నుంచి కేరళ మీదుగా దుబాయ్‌ వెళ్లిన ఎయిరిండియా (AirIndia) విమానంలో పాము కలకలం సృష్టించింది. కోల్‌కతా నుంచి బయల్దేరిన విమానం దుబాయ్‌ ఎయిర్‌పోర్టు‌కు (Dubai Airport) చేరుకున్న తర్వాత తర్వాత విమానాశ్రయ సిబ్బంది పాముని గుర్తించారు. ఈమేరకు డైరెక్టర్ జనరల్‌ ఆఫ్‌ సివిల్‌ ఏవియేషన్‌ (DGCA) ప్రకటించింది. ఎయిరిండియాకు చెందిన B737-800 విమానం కోల్‌కతా నుంచి శనివారం తెల్లవారుజామున బయలుదేరి.. తర్వాత కేరళలోకి కాలికట్‌‌ విమానాశ్రయానికి చేరింది. అక్కడ కొందరు ప్రయాణికులు విమానం ఎక్కిన అనంతరం బయలుదేరి దుబాయ్‌ ఎయిర్‌పోర్టులో ల్యాండ్‌ అయ్యింది.
విమానం నుంచి ప్రయాణికులంతా దిగిపోయి చివరిగా కార్గో క్యాబిన్‌ను సిబ్బంది చెక్‌ చేస్తుండగా పాము కనిపించింది. దీంతో క్యాబిన్ సిబ్బంది భయపడిపోయి.. అధికారులకు సమాచారం ఇచ్చారు. అత్యవసర విభాగం సిబ్బంది చేరుకుని పామును పట్టుకున్నారు. ఎవరికీ ఎటువంటి హాని జరకగపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. కాగా, ఈ ఘటనపై డీజీసీఏ తీవ్రంగా స్పందించింది. ఇదంతా గ్రౌండ్ డ్యూటీ సిబ్బంది వైఫల్యమేనని, విచారణ అనంతరం బాధ్యులపై అవసరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

అయితే, కార్గో క్యాబిన్‌లోకి పాము ఎలా వచ్చి చేరిందన్న దానిపై ఎయిరిండియా అధికార ప్రతినిధి స్పందించడానికి నిరాకరించారు. దర్యాప్తు చేపట్టి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. అంతేకాదు, విమానంలో ఎంత మంది ప్రయాణించారు.. వారి వివరాలను కూడా వెల్లడించలేదు. విమానం దిగిన తర్వాత సకాలంలో లగేజీ అందకపోవడంతో ప్రయాణికులు ఏడు గంటల పాటు విమానాశ్రయంలోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. జాప్యంపై వారు ఆరా తీయడంతో పాము కనిపించిన విషయం తెలిసింది. దీంతో అవాక్కయ్యారు. ఆలస్యంపై తీవ్ర అసహనానికి గురైన ప్రయాణికులు తమ ఆగ్రహాన్ని, ఆవేదనను సోషల్ మీడియాలో వెళ్లగక్కారు.

ఏడు గంటల పాటు ఎయిర్‌పోర్ట్‌లోనే ఉండిపోయామని పేర్కొంటూ వీడియోలను పోస్ట్ చేసి ఎయిరిండియా యాజమాన్యానికి ట్యాగ్ చేశారు. ఈ ఘటన పట్ల డీజీసీఏ కూడా విచారాన్ని వ్యక్తం చేసింది. జాప్యానికి చింతిస్తున్నామని తెలిపింది.

Read Latest National News And Telugu News
రచయిత గురించి
అప్పారావు జివిఎన్
జీవీఎన్ అప్పారావు సమయం తెలుగులో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ జాతీయ, అంతర్జాతీయ అంశాలకు సంబంధించిన తాజా వార్తలు, కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 10 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో విద్య, జాతీయ రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.