యాప్నగరం

జమ్మూ కశ్మీర్‌లో జవాన్‌ మిస్సింగ్.. ఉగ్రవాదులు కిడ్నాప్ చేసినట్టు అనుమానం

కుటుంబంతో కలిసి బక్రీద్ వేడుకలను జరుపుకున్న సైనికుడు కనిపించకుండాపోయిన ఘటన జమ్మూ కశ్మీర్‌లో చోటుచేసుకుంది. ఆదివారం సాయంత్రం నుంచి జవాన్ ఆచూకీ లభించలేదు.

Samayam Telugu 3 Aug 2020, 6:26 pm
జమ్మూ కశ్మీర్‌లో ఓ జవాన్‌ అదృశ్యమైనట్టు ఆర్మీ తెలిపింది. కుటుంబంతో కలిసి ఈద్ వేడుకలు జరుకున్న జవాన్.. ఆదివారం సాయంత్రం నుంచి కనిపించడం లేదని పేర్కొంది. షోపియాన్‌లోని 162 బెటాలియన్‌కు చెందిన రైఫిల్‌మేన్ షకీర్ మంజూర్ అదృశ్యమయ్యాడు. కనిపించకుండాపోయిన జవాన్‌ను తీవ్రవాదులు అపహరించినట్టు అనుమానిస్తున్నారు. జవాన్ అదృశ్యమైన విషయాన్ని ట్విట్టర్ ద్వారా వెల్లడించిన ఆర్మీ.. ఆయన ఆచూకీ కోసం వెదుకుతున్నట్టు వివరించింది.
Samayam Telugu సైనికుడి అపహరణ
Soldier Missing


‘162 బెటాలియన్‌కు చెందిన రైఫిల్‌మాన్ షకీర్ మంజూర్ ఆదివారం సాయంత్రం 5.00 గంటల నుంచి కనిపించడంలేదు.. ఆయన ప్రయాణించిన వాహనం కుల్గాం సమీపంలో గుర్తించాం. జవాన్‌ను ఉగ్రవాదులు అపహరించినట్లు అనుమానిస్తున్నాం.. ఆయన కోసం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది’ అని ట్వీట్ చేసింది. కుల్గాం జిల్లా రంభామా ప్రాంతంలో మంజూర్ కారు కాలిపోయిన స్థితిలో ఉందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.