యాప్నగరం

సోమాలి సముద్రపు దొంగల చెరలో భారత ఓడ

భారత్‌కు చెందిన ఓ కార్గో షిప్‌ను సోమాలియాకు చెందిన సముద్రపు దొంగలు హైజాక్ చేశారు.

TNN 3 Apr 2017, 7:44 pm
భారత్‌కు చెందిన ఓ కార్గో షిప్‌ను సోమాలియాకు చెందిన సముద్రపు దొంగలు హైజాక్ చేశారు. ఈ విషయాన్ని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ షిప్పింగ్ అధికారులు సోమవారం ఖరారు చేశారు. ఆ షిప్‌లో 11 మంది సిబ్బంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. హైజాక్ గురైంది పెద్ద షిప్ కాదని, తెర సహాయంతో నడిచే చిన్న ఓడ (ధో) అని చెప్పారు. ఆదివారం హైజాక్ గురైన ఈ ఓడ ప్రస్తుతం సోమాలియా తీరంవైపు ప్రయాణిస్తోందని డీజీఎస్ మాలిని శంకర్ తెలిపారు.
Samayam Telugu somali pirates hijack indian commercial ship official
సోమాలి సముద్రపు దొంగల చెరలో భారత ఓడ


దుబాయ్ నుంచి యెమెన్ వైపు ప్రయాణిస్తుండగా సోమాలియా సముద్రపు దొంగలు ఈ భారత ఓడను హైజాక్ చేసినట్లు ఆమె వివరించారు. ఓడలో 11 మంది సిబ్బంది ఉన్నారని చెప్పారు. కార్గో షిప్ వివరాలు ఇంకా తెలియలేదన్నారు. కార్గోపై ఆసక్తి చూపిన దొంగలు భారత ప్రభుత్వానికి మాత్రం ఎలాంటి డిమాండ్ పంపలేదని వెల్లడించారు. కార్గోని వారు సొంతం చేసుకున్న తరవాత మన వాళ్లని వదిలిపెట్టేస్తారని తాము భావిస్తున్నట్లు మాలిని శంకర్ చెప్పారు. కాగా, సోమాలి సముద్రపు దొంగల అరాచకాలు గత ఐదు సంవత్సరాలుగా తగ్గుముఖం పట్టాయి. తాజా ఉదంతంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.