యాప్నగరం

అమ్మకు విశ్రాంతి.. రాజకీయాలకు సోనియా గుడ్ బై

TNN 15 Dec 2017, 12:29 pm
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజకీయాల నుంచి రిటైర్మెంట్ ప్రకటించారు. తన కుమారుడు రాహుల్ గాంధీని పార్టీ అధ్యక్ష పీఠంపై కూర్చోబెట్టడానికి ఒక రోజు ముందు ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారు. భారతదేశంలోనే ప్రాచీన పార్టీగా పేరొందిన కాంగ్రెస్‌ పార్టీకి సోనియా గాంధీ 19 ఏళ్ల పాటు అధ్యక్షురాలిగా వ్యవహరించారు. ఆమె సారథ్యంలో కాంగ్రెస్ పార్టీ 2004, 2009 ఎన్నికల్లో విజయం సాధించింది. 2004 ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత సోనియా ప్రధానిగా బాధ్యతలు స్వీకరిస్తారని భావించారు. కానీ విదేశీయత అంశం తెరపైకి రావడంతో.. అనూహ్యంగా మన్మోహన్ సింగ్‌ ప్రధాని అయ్యారు.
Samayam Telugu sonia gandhi announces retirement from politics
అమ్మకు విశ్రాంతి.. రాజకీయాలకు సోనియా గుడ్ బై


47 ఏళ్ల రాహుల్ శనివారం పార్టీ అధ్యక్ష బాధ్యతలను స్వీకరించనున్నారు. నెహ్రూ-గాంధీ కుటుంబం నుంచి ఈ బాధ్యతలను స్వీకరిస్తోన్న ఆరో వ్యక్తి రాహుల్ కావడం విశేషం. గుజరాత్, హిమాచప్రదేశ్ ఎన్నికల ఫలితాలను సోమవారం ప్రకటించనుండగా.. అందుకు రెండు రోజుల ముందే రాహుల్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టనున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.