యాప్నగరం

సోనియా విందు: రాజకీయాలకు కాదు, దోస్తీ కోసమట!

సోనియా గాంధీ దేశంలోని ప్రతిపక్ష పార్టీ ముఖ్య నేతలకు విందు ఇచ్చారు. అయితే, ఇది రాజకీయ విందు కాదని, వారితో స్నేహభావం కోసమేనని వెల్లడించారు.

TNN 13 Mar 2018, 11:51 pm
ఢిల్లీ: యూపీఏ ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ మంగళవారం రాత్రి ఢిల్లీలోని 10, జన్‌పథ్‌లోని ఆమె నివాసంలో రాజకీయ విందు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె ప్రతిపక్ష పార్టీల ముఖ్య నేతలందరినీ ఆమె ఏకతాటి పైకి తెచ్చారు. శరద్ పవర్, ఒమర్ అబ్ధుల్లా, కనిమోజీ, తెజశ్వీ యాదవ్ తదితర ప్రతిపక్ష పెద్దలంతా ఈ విందుకు హాజరు కావడం విశేషం. వీరితోపాటు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌తో పాటు మల్లిఖార్జున్ ఖార్గే, రణదీప్ సుర్జేవాలా సైతం హాజరయ్యారు.
Samayam Telugu sonia gandhi hosts dinner for opposition parties congress says event held for friendship
సోనియా విందు: రాజకీయాలకు కాదు, దోస్తీ కోసమట!


ఈ సందర్భంగా సుర్జేవాలా మాట్లాడుతూ... ‘‘ఈ విందును రాజకీయ కోణంలో చూడొద్దు. స్నేహం, పరస్పరం సంబంధాలను పెంపొందించుకునే ఉద్దేశంతోనే ప్రతిపక్ష పార్టీలను ఆహ్వానించాం’’ అని తెలిపారు. ఈ విందులు ఎలాంటి ప్రసంగాలు లేకుండా స్నేహపూర్వక వాతావారణంలో సాగడం విశేషం.

‘‘యూపీఏ ఛైర్‌పర్శన్ సోనియా గాంధీ ఈ రోజు అద్భుతమైన విందు ఏర్పాటుచేశారు. వివిధ పార్టీల నేతలంతా ఒక్క చోటే కలుసుకోడానికి ఇదో చక్కని అవకాశం. రాజకీయ చర్చ చాలానే జరిగింది. కానీ, పార్టీల మధ్య సఖ్యత దీని ముఖ్య ఉద్దేశం’’ అని రాహుల్ గాంధీ అధికారిక ట్విటర్ ద్వారా వెల్లించారు.

ఈ పార్టీలో ఎన్సీ, ఎన్సీపీ, ఆర్జేడీ, డీఎంకే, సీపీఐ, సీపీఎం, సమాజ్ వాదీ పార్టీ, హెచ్‌ఏఎం, త్రుణముల్ కాంగ్రెస్, బీఎస్పీ పార్టీలకు చెందిన ముఖ్య నేతలంతా హాజరయ్యారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.