యాప్నగరం

అమ్మాయిల పెళ్లి వయసు పెంపు.. త్వరలోనే నిర్ణయం: మోదీ

PM Narendra Modi: అమ్మాయిల కనీస వివాహ వయస్సుపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మోదీ చెప్పారు. ఈ విషయంలో ఇప్పటికే నియమించిన కమిటీ త్వరలోనే నివేదిక సమర్పిస్తుందని తెలిపారు.

Samayam Telugu 16 Oct 2020, 11:10 pm
మ్మాయిల పెళ్లి వయసు పెంపు.. గత కొన్ని రోజులుగా దేశంలో ఇది చర్చనీయాంశంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఈ అంశంపై నిపుణులతో కమిటీని నియమించడమే అందుక్కారణం. బడ్జెట్ ప్రసంగంలోనే దీనిపై ప్రకటన చేయగా.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశ ప్రజలను ఉద్దేశించి ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో అమ్మాయిల పెళ్లి కనీస వయస్సు అంశాన్ని మరోసారి ప్రస్తావించారు. ఈ అంశంపై అతి త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ప్రధాని మరోసారి ప్రకటన చేశారు.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
Minimum Age of girl for marriage


‘అమ్మాయిల పెళ్లికి సరైన వయస్సు నిర్ణయంపై ఇప్పటికే ఏర్పాటు చేసిన కమిటీ చర్చలు జరుపుతోంది. కమిటీ ఏం సిఫారసులు చేసిందని దేశవ్యాప్తంగా పలువురు మహిళల నుంచి నాకు ప్రశ్నలు వస్తున్నాయి. కమిటీ నివేదిక వచ్చిన తర్వాత సాధ్యమైనంత తొందరగా ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకుంటుంది’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.

ఫుడ్‌ అండ్‌ అగ్రికల్చర్‌ ఆర్గనైజేషన్ (FAO) 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం (అక్టోబర్ 16) రూ.75 స్మారక నాణేన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమ్మాయిల పెళ్లి వయసు గురించి ప్రస్తావించారు. సమయంలో ప్రధాని మోదీ ఈ విధంగా స్పందించారు.

దేశవ్యాప్తంగా విద్యాసంస్థల్లో నమోదు చేసుకుంటున్న వారి శాతం బాలురతో పోలిస్తే బాలికలదే అధికంగా ఉందని మోదీ తెలిపారు. ఇలా పెరగడం దేశంలో ఇదే తొలిసారని ఆయన పేర్కొన్నారు. గత ఆరేళ్లుగా తమ ప్రభుత్వం చేస్తోన్న కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందన్నారు. కేవలం ఒక్క రూపాయికే అమ్మాయిలకు శానిటరీ ప్యాడ్‌లను అందిస్తున్నామని ఆయన గుర్తుచేశారు.

కనీస పెళ్లి వయసు పెంచితే ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం అమ్మాయిల కనీస పెళ్లి వయసు 18 ఏళ్లుగా, అబ్బాయిల పెళ్లి వయసు 21 ఏళ్లుగా ఉంది. అమ్మాయిల పెళ్లి వయసును 21 ఏళ్లకు పెంచుతారని అధిక మంది భావిస్తున్నారు. అమ్మాయిలకు 18 ఏళ్లకే వివాహం చేయడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. మహిళలు కెరీర్ పరంగా ఎదగడానికి ఇదొక అవరోధంగా మారిందని చెబుతున్నారు. అంతేకాకుండా 18 ఏళ్లకే పెళ్లి చేసుకోవడం వల్ల అమ్మాయిలు చిన్న వయసులోనే పిల్లల్ని కనడంతో ఆరోగ్యపరంగా పలు సమస్యలు వస్తున్నాయని వివరిస్తున్నారు.

అమ్మాయిలకు 18 ఏళ్లు వచ్చే వరకు కూడా చాలా మంది తల్లిదండ్రులు ఓపిక పట్టట్లేదు. బాల్య వివాహాలు జరిపిస్తున్నారు. కేసులు ఎదుర్కొంటున్నారు. మరి కనీస వివాహ వయసును పెంచితే పరిణామాలు ఎలా ఉంటాయి? మహిళల జీవితంపై ఈ నిర్ణయం ఎలాంటి ప్రభావం చూపుతుంది? సమాజంలో గుణాత్మక మార్పుకు ఈ నిర్ణయం దోహదం చేస్తుందా? అనే అంశాలు చర్చనీయాంశంగా మారాయి.

Don't Miss: అమ్మాయిలను మోసం చేసి పెళ్లి చేసుకుంటే కఠిన చర్యలు

Also Read: ధర్మపురి: 16 ఏళ్లకే గర్భం.. మట్టిలో కలిసిన పరువు, ప్రాణం
Must Read: కరోనాతో భర్త మృతి.. భార్యపై కేసు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.