యాప్నగరం

ఇకపై ఫోన్ రీచార్జ్‌కి ఐడీ చూపించాలి!

సిమ్ కార్డులు కొనడానికే కాదు, ఫోన్ రీచార్జ్ చేయించుకోడానికి కూడా ఇకపై ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు చూపించాలి.

TNN 6 Feb 2017, 5:56 pm
సిమ్ కార్డులు కొనడానికే కాదు, ఫోన్ రీచార్జ్ చేయించుకోడానికి కూడా ఇకపై ఆధార్, పాన్, డ్రైవింగ్ లైసెన్స్ లాంటి గుర్తింపు కార్డులు చూపించాలి. ఈ మేరకు సోమవారం సుప్రీం కోర్టు టెలీకాం శాఖను ఆదేశించింది. దేశంలో ఉన్న ప్రీ ప్రెయిడ్ సిమ్ వినియోగదారులంతా ఇకపై గుర్తింపు కార్డును చూపించి మాత్రమే రీచార్జ్‌లు చేసుకునేలా చర్యలు చేపట్టాలని సుప్రీం కోర్టు వెల్లడించింది. వాస్తవానికి భారత్‌లో ఉన్న మొబైల్ యూజర్లలో 90 శాతం ప్రీ పెయిడ్ వినియోగదారులే.
Samayam Telugu soon you may have to prove your identity to recharge your phone
ఇకపై ఫోన్ రీచార్జ్‌కి ఐడీ చూపించాలి!


ఈ కార్యక్రమాన్ని మరో ఏడాది లోపల అమల్లోకి తేవాలని ప్రధాన న్యాయమూర్తి ఖేహర్ నేతృత్వంలోని సుప్రీం కోర్టు బెంచ్ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గిని ఆదేశించింది. దేశంలో నేరాలను అరికట్టడానికి ఇది ఎంతగానో తోడ్పడుతుందని ధర్మాసనం అభిప్రాయపడింది. నకిలీ గుర్తింపు కార్డులతో సి‌మ్‌లు విచ్చలవిడిగా కొనడమే కాకుండా, వాటిని దుర్వినియోగం చేస్తున్న వారి దేశంలో చాలా మందే ఉన్నారు. దీనిపై దాఖలైన ప్రజావాజ్యాన్ని విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు పై విధంగా తీర్పునిచ్చింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.