యాప్నగరం

ఎస్పీ గూండాలను పెంచి పోషించింది

నేరగాళ్లకు, గూండాలకు సమాజ్‌వాదీ పార్టీ ఆశ్రయమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

Samayam Telugu 8 Feb 2017, 4:13 pm
నేరగాళ్లకు, గూండాలకు సమాజ్‌వాదీ పార్టీ ఆశ్రయమిస్తోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. యూపీలోని మహిళలకు రక్షణ లేకుండా పోయిందని విమర్శించారు. బుధవారం యూపీలోని ఘజియాబాద్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన పాల్గొన్నారు.
Samayam Telugu sp shelters goons in up says modi
ఎస్పీ గూండాలను పెంచి పోషించింది


‘మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, హత్యల విషయంలో ఎస్పీ ఏ మాత్రం బాధపడటం లేదు, వాటిని నియంత్రించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని’ మోదీ మండిపడ్డారు. ఐదేళ్లుగా యూపీలో అధికార ఎస్పీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలేంటో చెప్పాలని ఆయన ప్రశ్నించారు.

‘సీఎం అఖిలేశ్‌ యాదవ్‌ బాగా చదువుకున్న వ్యక్తి, కానీ ఐదేళ్లలో రాష్ట్రాన్ని నాశనం చేశారని విమర్శించారు. ఆయన హయంలో శాంతి, భద్రతలు అదుపులో లేవని మోదీ అన్నారు. యూపీలో భాజపా అధికారంలోకి వస్తే ప్రజల సమస్యలన్నీ తీరుస్తుందని, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుందని ఆయన పేర్కొన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.